చైనాలోనే ఇలా జరుగుతుంది, మాజీ సైనికాధికారికి జీవిత ఖైదు

చైనా మిలిటరీ లో ఉన్నతాధికారుల ఉద్యోగాలు ఎపుడూడతాయో,  వాళ్లెపుడు జైలుకు పోతారో  ఎవరూ చెప్పలేరు. మిలిటరీ జనరల్స్, దేశంలో అత్యున్నత సైనిక సంస్థ అయిన పెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యులు కూడా ఉన్నట్లుండి మాయమవుతారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. కొొంతమంది హఠాత్తుగా చనిపోతుంటారు.రెండేళ్ల కిందటి దాకా చైనా మిలిటరీని శాసించిన ఒక అత్యున్నత అధికారి ఒకరు ఈ రోజు జైలుకెళ్లారు.

అవినీతి అరోపణల మీద విచారణ చేసిన మిలిటరీ కోర్టు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చీఫ్ ఆప్ జాయింట్ స్టాఫ్ జనరల్ ఫా ఫెంగుయ్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.  భారీగా లంచాలివ్వడం, తీసుకోవడం చేశాడని మిలిటరీ కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది. ఫా అస్తులన్నంటిని ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది. ఆయన వయసు 67సంవత్సరాలు.

ఆయన పెద్ద అవకాశవాది అని మిలిటరీ వాళ్లు చెబుతున్నారు. ఆయన చైనా లో అత్యంత శక్తి వంతమయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా కూడా పనిచేశారు. గతంలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ హెడ్ గా పనిచేసిన జాంగ్ యాంగ్ కు బాగా సన్నిహితుడు. ఆయన మీద కూడ లంచం ఆరోపణలు వచ్చాయి. వాటి మీద విచారణ సాగుతున్నపుడే జాంగ్ ఆత్మ హత్య చేసుకున్నాడు.

ఫా 1968లో సైన్యంలో చేరారు. 1998లో మేజర జనరల్ స్థాయికి ప్రమోషన్ పొందారు.2010లో చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ అయి సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యు డయ్యారు. ఆయన ఎంతకీలకమయిన బాధ్యతల్లో ఉన్నారంటే, 2017 చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ అమెరికా అధ్యక్షుడితో సమావేశమయినపుడు ఫా కూడా ఉన్నారు. ఆ తర్వాతే ఆయనను పదవి నుంచి తొలగించారు. అప్పటినుంచి ఆయన బయట కనపడనే లేదు. కొద్దిరోజుల తర్వాత ఆయన మీద అవినీతి విచారణ జరుగుతూ ఉందని ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఇపుడు ఈ జైలు శిక్ష విధించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.