అంతా అనుకున్నట్లే ఆమె కూడా భావించారు. అందరికి వచ్చిన అనుమానమే ఆమెకు వచ్చింది. అందుకే తనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తీసుకోలేనని ప్రఖ్యాత ఒడియా రచయిత్రి గీతా మెహతా తిరస్కరించారు. ఆమె ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి.
అవార్డులలో చాలా రాజకీయాలుంటాయి. అవార్డులను రాజకీయాలకు ఉపయోగించుకోవడం అందిరికి తెలిసిందే. ఇపుడు గీతా మెహతాకి పద్మశ్రీ ప్రకటించగానే అందరికి ఇదే అనుమానం వచ్చింది.ఏ ఫ్రంటువైపు మొగ్గు చూపకుండా ఉంటున్న బిజూ జనతా దళ్ నేత, ముఖ్యమంత్రినవీన్ పట్నాయక్ ను మచ్చిక చేసుకునేందుకే సోదరి గీతా మెహతాకి పద్మశ్రీ అవార్డు ప్రకటించారని , కేంద్రం అవార్డుల జాబితాను ప్రకటించినప్పటినుంచి విమర్శ మొదలయింది. అందుకే ఆమె ఈ అపవాదు నుంచి తప్పించుకునేందుకు అవార్డును తిరస్కరించారు. ఈ మేరకు శని వారం నాడు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మెహతా న్యూయార్క్ లో ఉంటారు. అవార్డు ప్రకటిస్తున్నపుడు ఆమె విదేశీయురాలు అని కూడా కేంద్రం రాసింది ఇది రాజకీయాలకు అతీతమమనిచెప్పే ప్రయత్నం చేశారు.
అవార్డు రావడం తనకెంతో సంతోషంగా ఉందని, ఇది గర్వకారణమని అంటూనే అవార్డు ప్రకటించిన సమయం సరైంది కాదని అన్నారు.ఎన్నికలు రాబోతున్నపుడు ఈ అవార్డు ప్రకటించడం వల్ల ఇందులో రాజకీయం ఉందనే అపోహ కలుగుతుంది. ఇది తనకు గాని, ప్రభుత్వానికి గాని మంచిది కాదని ఆమె అన్నారు. అందువల్ల అవార్డు స్వీకరించలేనని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇది ఆమె ప్రకటన.
“I am deeply honoured that the Government of India should think me worthy of a Padma Shri but with great regret I feel I must decline as there is a general election looming and the timing of the award might be misconstrued, causing embarrassment both to the Government and myself, which I would much regret.”
ఆమె నవీన్ పట్నాయక్ అక్క. వయసు 76 సంవత్సరాలు. ఆమె రాసిన పుస్తకాలు Karma Cola (1979), Raj (1989), A River Sutra (1993), Snakes and Ladders: Glimpses of Modern India (1997) and Eternal Ganesha: From Birth to Rebirth (2006). ఆమె అనే డాక్యుమెంటరీలు కూడా తీశారు.
అల్ ఫ్రెడ్ నాఫ్ పబ్లిషింగ్ చీఫ్ అయిన సోన్నీ మెహతాను ఆమె వివాహమాడారు.
