ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ కార్పొరేషన్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లలాగా , ఇంకా స్పష్టంగా చెబితే, అంతకంటే, గొప్పగా తీర్చి దిద్దుతున్నారు. పరిసరాలు, ప్రాథమిక వసతుల్లోనేకాదు, బోధనలో కూడా కార్పొరేట్ స్కూళ్లను ప్రభుత్వ పాఠశాలలు మించిపోవాలన్నది ఆయన కల. ఏ విషయంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు ఖరీదయిన కార్పొరేట్ స్కూళ్లకంటే తక్కువగా ఉండరాదని, ప్రభుత్వ పాఠశాలలకు ఒక నాటి గౌరవం తీసుకురావాలన్నది ఆయన ఆయన ఆశయం. విద్యారంగాన్ని సంస్కరించేందుకు 2016-17లో ఆయన బడ్జెట్ లో 22.8 శాతం నిధులు కేటాయించారు. మరే రాష్ట్రం ఇంత భారీగా విద్యకు నిధులు కేటాయించలేదు. ఈ విషయంలో ఆల్ ఇండియా సగటు కేవలం 15.6 శాతమే నని రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ మధ్యనే కేజ్రీవాల్ దలైలామాతోకలసి స్కూళ్లలో హ్యాపినెస్ కరికులమ్ ప్రవేశపెట్టారు. ఆయన కల ఇలా సాకారమవుతూ ఉంది. కొన్ని ఫోటోలు, వీడియో
ఢిల్లీలో కేజ్రీవాల్ స్కూల్స్ ఇలా రెడీ అవుతున్నాయ్ (వీడియో)





