చంద్రబాబుకు బిగ్ షాక్ తప్పదా?

కూల్ గా ఉన్న ఏపీ రాజకీయాలు వేడెక్కనున్నాయి. ఆంధ్రాలో కూడా ముందస్తు ఎన్నికలు రానున్నట్టు గట్టిగ టాక్ వినబడుతోంది. లోక్ సభను ముందే రద్దు చేసే ప్లాన్ లో మోడీ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. జమిలి ఎన్నికల ప్లాన్ లో ఉన్న బీజేపీ అది కుదరని పక్షాన లోక్ సభకు ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ లోక్ సభ ఎన్నికలతో పాటు దగ్గర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలు నిర్వించాలని సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.

ఆరు నెలల ముందు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్ కి ఉందని మోడీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తెలంగాణలో ఎన్నికలు ముగిశాక జనవరిలో ఏపీలో ఎన్నికలు జరిపే ప్లాన్ లో మోడీ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు మాత్రం ముందస్తు ఎన్నికలకు ససేమీరా అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఎన్నికల కమిషన్ కి ఉన్న అధికారంతో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిపేందుకు వ్యూహాలు రచిస్తోంది బీజేపీ అధిష్టానం.

ఇటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా ముందస్తు ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటుంది. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో మోడీ లోక్ సభను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ మోడీ ఈ ప్లాన్ అమలు చేస్తే జనవరిలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ముందస్తు ఎన్నికలకు నో చెప్తున్న టీడీపీ అధినేతకు షాక్ ఇవ్వనుంది బీజేపీ ప్రభుత్వం.

అయితే ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మాత్రం గతంలో వైసిపి విస్తృత స్థాయి సమావేశంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనవరిలోనే ఎన్నికలు ఉండవచ్చు. నేతలంతా అందుకు సిద్ధంగా ఉండాలి అంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు నేతలకి ప్రజల్లోకి వెళ్లి నవరత్నాల పధకం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలంటూ సూచించారు. ఇప్పుడు బీజేపీ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తుందంటూ వార్తలు రావడంతో జగన్ చేసిన వ్యాఖ్యలకు విశేషత సంతరించుకుంది. వైసిపి, బీజేపీ మధ్య రహస్య పొత్తు ఉందంటూ టిడిపి చేస్తున్న ప్రచారానికి బలం చేకూరినట్టైంది.