ఇక విమర్శించింది చాలు, ఇష్టం లేకుంటే పార్టీ నుంచి వెళ్లి పోవచ్చిన పాట్నాబాలివుడ్ నటుడు, బిజెపి ఎంపి శత్రఘ్న సిన్హా కు భారతీయ జనతా పార్టీ అల్టిమేటమ్ జారీ చేసింది.
బీహార్ రాజధాని పట్నా సాహెబ్ లోక్ సభ నియోజక వర్గం నుంచి శత్రు బిజెపి అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. అయితే, మోదీ ప్రధాని అయ్యాక ఆయనను పార్టీ పెద్ద గా పట్టించుకోవడం లేదు. దానికి తోడు ఆయన కూడా పార్టీలోని రెబెల్స్ (మాజీ మంత్రులు యశ్వంతా సిన్హా, అరుణ్ శౌరి)గొంతుకలపి ప్రధాని విధానాలను విమర్శించడం మొదలు పెట్టారు. ఇది పార్టీని బాగా ఇరుకున పెడుతున్నది. మోదీ విధానాలను విమర్శించడంతో ప్రతిపక్షాల మధ్య, ప్రజలలో శత్రు కు విపరీతమయిన పలుకుబడి పెరిగింది.
ప్రధాని మోదీతోపాటు పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కూడా విమర్శించడంతో పాటు లాలూ ప్రసాద్ వంటి వారిని వెనకేసుకుని రావడంతో బిజెపి ఆయన ఈ వార్నింగ్ ఇచ్చింది.
బీహార్ డిప్యూటి చీఫ్ మినిస్టర్ సుశీల్ కుమార్ మోదీ ఈ రోజు ఈ వార్నింగ్ ఇచ్చారు. ‘‘ మీకు పార్టీ, పార్టీ నాయకత్వం నచ్చకపోతే, వెళ్లిపోండి,’’ ఆయన హెచ్చరించారు.
‘మీరు పాడుకంపెనీతో తిరుగుతున్నారు. దీనితో రెగ్యులర్ ప్రధాని తో సహా పార్టీ జాతీయ నాయకుల మీద విమర్శలు చేస్తున్నారు. రెండు సార్లు రాజ్యసభకు, రెండు సార్లు పార్లమెంటుకు ఈ పార్టీ మిమ్మల్ని ఎంపిక చేసింది. వాజ్ పేయి ప్రభుత్వంలో మీరు మంత్రి కూడా ఆయారు. ఇవన్నీ విస్మరించి మీరు విమర్శలకు పూనుకుంటున్నారు,’సుశీల్ కుమార్ మోడీ అన్నారు.
శత్రఘ్న సిన్హా ఈ మధ్య ప్రధాని మోదీ ధోరణి మీద చేసిన ట్వీట్ ఈచర్యకు కారణమని పరిశీలకులు చెబుతున్నారు.
‘వద్దుసర్, పి చిదంబరం, శశిథరూర్, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా, మరీ ముఖ్యంగా బీహార్ లో ప్రజల మనిషిగా పేరున్నఆర్ జెడి నేత లాలూ ప్రసాద్ మీద ప్రతీకార రాజకీయాలు ఇక వద్దు. లాలూ ప్రసాద్ కు దీని వల్ల బాగా సానుభూతి పెరుగుతూ ఉంది. మళ్లీ విజృంబించే శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయ’ అని ట్వీట్ చేశారు.
Sir, no more vendetta politics that we have been seeing with P. Chidambaram, Shashi Tharoor, Rahul Gandhi, Robert Vadra & especially in the case of the man of the masses Lalu Prasad Yadav @laluprasadrjd. He is gaining tremendous sympathy & has the ability & capability to bounce
— Shatrughan Sinha (@ShatruganSinha) January 11, 2019
దీనితో బిజెపికి మండింది. ఎందుకంటే, ఇప్పటికే ఆయన కాంగ్రెస్ నుంచో ఆర్ జెడి నుంచో పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే టాక్ బాగా ఉంది. అలాంటపుడు ఈ ట్వీట్ దానిని రుజువు చేసిందని బిజెపి భావించినట్లుంది. అందుకే బీహార్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీతో హెచ్చరిక ఇప్పించారు.
