అయిదేళ్ల కు కలం పట్టిన అద్వానీ, మోదీకి చురక

భారతీయ జనతా పార్టీ సంస్థాపకుల్లో ఒకరు, మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీ చాలా కాలం తర్వాత కలం పట్టారు. ఇపుడు మనం ఉన్నవి ’మన్ కి బాత్ ’ రోజులని ఆయనకు తెలుసు. చీమలుపెట్టిన పుట్టలు… అన్నటు తమ బిజెపిని నరేంద్రమోదీ అక్రమించుకున్నారు. సర్వత్రా ఆయన భక్త బృదం తయారయింది. నమో నినాదాలు చుట్టూర చెవులు పిక్కటిల్లేటట్లు వినబడుతున్నాయి. అందుకే తన మనుసులోని మాటని ఆయన ఎపుడూ ఎవరితో పంచుకోవాలనుకోలేదు. ఎందుకో, ఇక లాభంలేదని మనుసులోని ఆవేదని మాటల్లో కాకుండా అక్షరాల రూపంలో బయటపెట్టాలనుకున్నారు.

1806 రోజలు తర్వాత ఆయన కలం పెట్టారు. ఇంకొక 19 రోజులుంటే ఆయన కలం పట్టక అయిదు సంవత్సరాలు పూర్తయ్యేవి. లేదు, ఆయన ఉండబట్టలేకపోయారు. గురువారం నాడు తన బ్లాగ్ లో 512 పదాల ‘నేషన్ ఫస్ట్, పార్టీ నెక్ట్స్, సెల్స్ లాస్ట్ ’ ( ముందుదేశం, తర్వాతే పార్టీ, చివరన స్వార్థం) అని రాశారు. దాన్ని చూస్తూనే ఇది ఇప్పటి బిజెపిని నడిపిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మీద ఎక్కు పెట్టిన బాణమని సులభంగా అర్థమవుతుంది.

తన మాటను వ్యతిరేకించిన వాళ్లందరిని ఇపుడున్న బిజెపి దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నది. ప్రతి చర్చలోకి సైన్యాన్ని తీసుకువస్తూంది. ఈ ధరోణితో విభేధించిన వారందరిని జాతి వ్యతిరేకులు (anti-national) గా ప్రకటిస్తున్నది. ఈ ధోరణి బిజెపి తత్వం కాదని అద్వానీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. బిజెపి ని వ్యతిరేకించే వాళ్లంతా ప్రత్యర్థులే కాని, జాతి వ్యతిరేకులు కాదని ఆయన స్పష్టంగా చెప్పారు. రెండో సారి ప్రధాని అయ్యేందుకు మోదీ అనుసరిస్తున్న వ్యూహాల్లో జాతి వ్యతిరేకత అనేది ఒకటి.నిజానికి ఈ జాతి వ్యతిరేక వర్గంలోకి అద్వానీ కూడా వస్తారు. ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా మోదీ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఇపుడు రాసిన బ్లాగ్ అర్థమేమిటి? అయినా సరే, తన ఆలోచలనలను అద్వానీ దేశ వోటరు ముందు పెట్టారు. జాగ్రత్త అని హెచ్చరించారు. భారత ప్రజాస్వామ్యంలో భాగస్వాములయ్యే వారంతా నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవలసిన సమయం వచ్చిందని ఆయన దేశ ప్రజలందరికి గుర్తు చేశారు.

పార్టీ సరైన దారిలో నడుస్తున్నదా అని ప్రశ్నించుకోవాలని(introspect whether the party was going in the right direction) ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు.

ఇది సంచలనం సృష్టించింది. చాలా మంది‘వావ్ గొప్ప మాట చెప్పారే’ అని ఆశ్చర్య పోయారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశంసించారు. ప్రజాస్వామ్య గౌరవ మర్యాదలను ఆచరించడం మీద భారత దేశ మాజీ ప్రధానిగా, బిజెపి సంస్థాపకుడిగా, దేశ రాజకీయాలలో పెద్దాయనగా అద్వానీ వ్యక్తీరించిన అభిప్రాయాలు చాలా ముఖ్యమయినవి. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినంత మాత్రాన ప్రతిపక్షాలు జాతి వ్యతిరేకులెలా అవుతాయి. ఆయన అభిప్రాయాలను వినయపూర్వకంగా స్వాగతిస్తున్నాం,’అని అమె అన్నారు.

 

ప్రధాని మోదీ కూడా ‘బిజెపి సైద్ధాంతిక సారాన్ని’ వడపోచి చెప్పారని వ్యాఖ్యానించారు.

అద్వానీ చివరిసారి కలం పట్టింది ఏప్రిల్ 23, 2014న, మోదీ ప్రధాని అవడానికి నెలరోజుల ముందు. ఆపుడాయన తన క్యాంపెయిన్ విశేషాలను ‘some snippets (mostly media coverage) from my campaign’రూపంలో మననం చేసుకున్నారు. ఆ తర్వాత 2016లో పది రోజుల ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ ల పర్యటన తర్వాత ఒక ఇంగ్లీష్ వార పత్రికకు యాత్రా వ్యాసం రాశారు. ఆ పర్యటనలో ఆయన పోప్ ఫ్రాన్సిస్ ను కలుసుకున్నారు.

అద్వానీ ఇంతవరకు ఏడుసార్లు ఎంపిగా ఎన్నియ్యారు. గత ఎన్నికల్లో ఆయన గాంధీనగర్ (గుజరాత్ )నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆ స్థానం నుంచి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్నారు. మరికొంత మంది సీనియర్ లతో కలసి అద్వానీ మార్గదర్శకమండలికి పింపించారు.

అద్వానీ ఫుల్ బ్లాగ్ ఇక్కడ చదవండి

2014 ఎన్నిలక ముందు నరేంద్రమోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిపాదనను అద్వానీ వ్యతిరేకించారు. దానితో ఆయన క్రియాశీల రాజకీయాల ముగింపు అధ్యాయం మొదలయింది. మోదీ ప్రధాని అభ్యర్థి, ప్రధాని అయ్యారు. అద్వానీకి పార్టీలో ఎలాంటి పాత్ర లేకుండా చేశారు.

అందుకే “లోపల పార్టీలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక సంప్రదాయాలను కాపాడుకోవడమేనేది భారతీయ జనతా పార్టీ ముద్రగా వుంటూ వచ్చింది,” అని అద్వానీ రాశారు. “Defence of democracy and democratic traditions, both within the party and in the larger national setting, has been the hallmark of the BJP,” అని అనడం ఒక విధంగా మోదీని అభిశంషించడమే.

‘రాజకీయంగా విభేదించిన వారిని శత్రువులుగా పరిగణించడం భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఎపుడూ జరగలేదు. బీజేపీని విమర్శించిన వారిని, రాజకీయంగా విభేదించిన వారిని ప్రత్యర్థులుగానే పరిగణించాం. వ్యక్తిగతంగా, రాజకీయంగా ప్రతిపౌరునికి ఉన్న ఎంపిక స్వేచ్ఛను పార్టీ గౌరవించింది,’ అని ఆయన రాశారు.

తనను పలుమార్లు ఎన్నుకున్న గాంధీనగర్ నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు టికెట్ నిరాకరించిన వార్తను పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కాక ఓ దిగువస్థాయి నేత తెలియజేయడం పట్ల అద్వానీ తీవ్ర వేదన చెందారు.

బీజేపీ వ్యవస్థాపక దినం (ఏప్రిల్ 6) కు ఒక రోజు ముందు తన ఆవేదను ఆయన దేశ ప్రజలతో పంచుకోవాలనుకున్నారు.

ఇది మోదీ ఆలోచనల్లో మార్పు తెస్తుందనుకోలేం.