ఎన్నికలు ఎన్డీయేకి సై, మోదీ హవా లేదు: CSDS-Lokniti పోలింగ్ ముందు సర్వే

దేశం పార్లమెంటు ఎన్నికల మొదటి దశకు సిద్ధమవుతూ ఉంది. ఈ సాయంత్రం అయిదుగంటలకు ఎన్నికల ప్రచార సందడి ముగుస్తుంది. ఈ నెల 11 న అంటే గురువారంనాడు  తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ జరుగనుంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగుతుంటే, ఆంధ్రలో  అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు రెంటికి పోలింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాకరమయిన సిఎస్ డిఎస్ -లోక్ నీతిసర్వే బయటకు వచ్చింది. సిఎస్ డిఎస్ అంటే సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ డెవెలపింగ్ సొసైటీస్. దీని డైరెక్టర్ ఫ్రొఫెసర్ సంజయ్ కుమార్.  ఇతర సర్వేలకు దీనికి కొంత తేడా ఉంటుంది. ఇది మూడ్ ఎలా ఉందో చూస్తుంది.  సిఎస్ డిఎస్ -లోక్ నీతి ఎన్నికల ముందు (ప్రీ పోల్ ) సర్వే దేశంలో ఓటర్ల మూడ్ ఎలా ఉందో ఇపుడు పరిశీలించింది.
ఈ సర్వే ప్రకారం దేశంలో ఓటర్లు మూడ్ ఎన్డీఎకు అనుకూలంగా ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వలోని ఎన్డీయే రెండో చాన్స్ ఇవ్వాలనే మూడ్ ప్రజల్లో కనిపించిందని సర్వేని పర్యవేక్షించిన సందీప్ శాస్త్రి, సుహాష్ పాల్షికర్, సంజయ్ కుమార్ లు పేర్కొన్నారు. వీళ్ల సర్వే ప్రకారం ఎన్డీయే కు 263 నుంచి 283 స్థానాలు వస్తాయి. యుపిఎకి 115 నుంచి 135 స్థానాల వరకు రావచ్చు. కచ్చితంగా ఈ ఎన్నికలు మోడీకి సంబంధించి 2014 లాగా సునామీ లాగ ఉండవని ఈ సర్వే ఫలితాలు చూస్తూ అర్థమవుతుంది.
ఓటింగ్ శాతం విషయానికి వస్తే, ఎన్డీయేకు 41 శాతం ఓట్లు పోలవచ్చ. ఇందులో బిజెపికి సొంతంగా  35 శాతం వస్తే, మిత్రపక్షాలకు6 శాతం దాకా రానున్నాయని అంచనా.సర్వే పూర్తి వివరాలు ‘ది హిందూ’ లో ఉన్నాయి.
ఇక యుపిఎకి సంబంధించి 30 శాతం ఓట్లు పోలవుతున్నాయి. కాంగ్రెస్ కు 23 శాతం వోట్లు వస్తాయని  ఈ సర్వే చెబుతున్నది. కాంగ్రెస్ మిత్రపక్షాాలకు 7 శాతం వోట్లు పడతాయి.
నిజానికి ఒక ఏడాది కిందట ఎన్డీయే/బిజెపి పరిస్థితి అంత బాగా లేదు. ఈ ఏడాదిా యాంటిఇంకంబెన్సీ(ప్రభుత్వ వ్యతిరేకత)ను పొగొట్టుకో గలిగిందని సర్వే చెబుతున్నది.
మార్చి చివరి వారం నాటికి ఎన్డీయే మెజారిటీ ఫిగర్  సమీపానికి వస్తూ ఉంది. అయితే, సొంతంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసేంత మెజారిటీ బిజెపికి రావడం లేదు.
 ఈ సర్వేలో తేలిన అతి ముఖ్యమయిన విషయం ఏమిటంటే బిజెపి నాయకత్వంలోని ఎన్డీయేకి అనుకూలంగా ఏ గాలి వీచడం లేదు. ఎలాంటి వేవ్ దేశంలో లేదు. ఇంకా స్పష్టంగా చెబితే మోదీ సుడిగాలి లేదు.
అందుకే దేశంలోని వివిధ ప్రాంతాలలో , ఒక్కొక్క తీరుగా ఫలితాలు రానున్నాయి. 
బిజెపి, కాంగ్రెస్ లకు మొత్తం గా చెరో నాలుగు శాతం వోట్లు  పెరిగే అవకాశం ఉంది.బిజెపి విషయంలో ఈ నాలుగు శాతం వోట్లు సీట్లు గా మారకపోవచ్చు. బిజెపి మిత్రపక్షాలు, యుపిఎ మిత్ర పక్షాలను దెబ్బతీస్తున్నాయి. అందుకే వాటి పట్టు ఎన్డీయేలో బాగా గట్టిగా ఉంటుంది.
ప్రాంతాల వారీగా…
ఉత్తర భారత దేశంలో, మధ్య భారత దేశంలో బిజెపి పనితీరు  తగ్గిపోతుంది. ఇక్కడ బిజెపి ఫలితాలు 2014 లాగా ఉండవు.
ఉత్తర ప్రదేశ్ లో ఎస్ పి- బిఎస్ పి కూటమి బిజెపి పెద్ద సవాల్ విసురుతూ ఉంది. ఈ ట్రెండ్  మారక పోతే బిజెపి కి  అక్కడ ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఉత్తర ప్రదేశ్ దేశ్ దేశం లో అత్యంత కీలకమయిన రాష్ట్రం. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం మీద ఈ ఫలితాల ప్రభావం చాలా వుంటుంది.
మధ్య ప్రదేశ్,చత్తీష్ గడ్ లలో కూడా  బిజెపికి 2014 నాటి ఫలితాలు రావు.
పడమటి భారతదేశంలో కూడా బిజెపికి సీట్లు తగ్గుతాయి.
అయితే, ఉత్తరాన, మధ్యన, పడమట వచ్చే నష్టాన్ని బెంగాల్, ఈశాన్య భారత దేశంలో వచ్చే కొత్త సీట్లతో బిజెపి కొంతవరకు పూరించుకోవచ్చు.
దక్షిణ భారతదేశంలో మాత్రం బిజెపి పరిస్థితి మెరుగు పడే అవకాశాలు దాదాపు లేనట్లే.బిజెపి 
బిజెపి సొంత బలం బాగా తగ్గిపోతున్నందున, ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు బిజెపి మిత్రపక్షాల మీద బాగా ఆధారపడాల్సి రావచ్చు.(తెలంగాణ ముఖ్యమంత్రి కెసి ఆర్ ఈ విషయాన్ని పసిగట్టినట్లున్నారు. ఆయన ఈ మధ్య బిజెపి మీద మోదీ దాడి ఉధృతం చేశారు)
బిజెపి + మిత్రపక్షాలను కలిపి బేరీజు వేస్తే…  ఈ కూటమి (ఎన్డీయే) ఉత్తర, పశ్చిమ, మధ్య భారతదేశంలో  బాగా పనిచేస్తుంది. తూర్పున, ఈశాన్యాన ఈ కూటమి మెరుగుపడుతూ ఉంది.
దక్షిణం, ఉత్తరం కాదుగా, అలాగే దక్షిణ తూర్పు, పడమర కాదు. అందకే దక్షిణాది ప్రజలు బిజెపికి వ్యతిరేకంగానే ఓటేస్తున్నారు.  సర్వేకి స్పందించిన వారిలో 45 శాతం మంది, ఇది అత్యధికం, దేశాన్ని బిజెపి రాంగ్ డైరెక్షన్ లో నడిపిస్తూ ఉందని అభిప్రాయపడుతున్నారు.
వయసుకు సంబంధించి చూస్తే…
25 సం. లపు కుర్రావాళ్లలో  బిజెపిని బలపరిచే ఉత్సాహం ఎక్కువగా కనిపిస్తున్నది.
అయితే, వయసు పెరిగే కొద్ది ఈ మద్దతు తగ్గిపోతూ ఉండటం సర్వే విశేషం. 
అందుకే క్లియర్ గా ఎన్డీయేకి అడ్వాంటేజ్ ఉన్నా, ఇది బిజెపికి, మోదీకి చెమటలు పట్టిస్తున్నఎన్నిక అని సర్వే చేసిన పండితులు చెబుతున్నారు.
(సందీప్ శాస్త్రి, నేషనల్ కోర్డినేటర్; లోక్ నీతి నెట్ వర్క్,సుహాస్ పాల్షీకర్, సిఎస్ డిఎస్ లో లోక్ నీతి కార్యక్రమాల కోర్టినేటర్;సంజయ్ కుమార్ , డైరెక్టర్ సిఎస్ డిఎస్, కోఆర్డినేటర్ , లోక్ నీతి)