ఇస్మార్ట్ బ్యూటీ భారమంతా పూరీ పైనే.!

‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నభా నటేష్.. నటిగా మంచి పేరు తెచ్చుకుని కుర్ర హృదయాల్ని కొల్లగొట్టాలనుకుంది. కానీ, ఒకటీ అరా అవకాశాలతో ఓ మోస్తరు హీరోయిన్ అనిపించుకుంది తప్ప ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది.

పూరీ జగన్నాధ్ రూపంలో ‘ఇస్మార్ట్ శంకర్’ ఛాన్స్ వచ్చింది నభా నటేష్‌కి. ఈ సినిమాతో నభా నటేష్ స్టార్‌డమ్ మారిపోయింది. సినిమా సూపర్ హిట్ అవ్వడం.. అందులోనూ నభా నటేష్‌ని ఈ సినిమాలో పూరీ కొత్తగా చూపించడంతో.. అమ్మడి దశ తిరిగిపోయింది.

ఇస్మార్ట్ బ్యూటీ ట్యాగ్ వేయించుకుని తనదైన ప్రత్యేకతను చాటుకుంది. అయితే, అక్కడే ఆగిపోయింది నభా నటేష్ కెరీర్. అలా వచ్చిన ఫేమ్‌ని కంటిన్యూ చేయలేకపోయింది. ఇక ఇప్పుడు మరోసారి పూరీ పైనే ఆశలు పెట్టుకుందట నభా నటేష్. పూరీ జగన్నాధ్‌తో టచ్‌లోకి వెళ్లిందని తాజా గాసిప్. పూరీ కూడా నభాకి ఛాన్సిస్తానని హామీ ఇచ్చాడట. అయితే, ప్రస్తుతం పూరీ సినిమాలు చేయట్లేదు. చిరంజీవితో ప్రాజెక్ట్ కోసం స్కెచ్‌లో బిజీగా వున్నాడు.

ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ గ్యాప్‌లో ఓ యంగ్ హీరోతో పూరీ సినిమా చేయాలనుకుంటున్నాడట. బహుశా ఆ సినిమాలో నభాకి ఛాన్సిస్తాడేమో చూడాలి మరి.