విడాకులపై యంగ్ హీరో నిఖిల్ లేటెస్ట్ పోస్ట్ వైరల్.!

టాలీవుడ్ లో ఉన్న అనేక మంది యంగ్ హీరోస్ లో కెరీర్ స్టార్ట్ నార్మల్ సినిమాలతోనే వచ్చినా తర్వాత మాత్రం నెమ్మదిగా థ్రిల్లర్ సినిమాలు చేస్తూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ. అయితే తాను కూడా కెరీర్ లో కాస్త స్లో అయ్యి మంచి విజయాలు అందుకుంటూ లేటెస్ట్ గా వచ్చిన చిత్రం “కార్తికేయ 2” తో తన కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమాని అయితే చూసాడు.

ఇక ఈ చిత్రం ఇంకా సెట్స్ మీద ఉన్న సమయంలోనే కరోనా టైం లో పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే లేటెస్ట్ గా సినీ వర్గాల్లో ఎందుకో ఓ షాకింగ్ టాక్ ఈ నిఖిల్ జంటపై స్టార్ట్ అయ్యింది. నిఖిల్ దంపతులు విడాకులు తీసుకుంటున్నారని పలు వార్తలు వైరల్ అవుతూ ఉండగా నిఖిల్ సోషల్ మీడియాలో అయితే అందరికీ ఓ అదిరిపోయే పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చాడు.

తమ ఇద్దరి ఫోటో పెట్టి మనం ఎప్పుడు కలిసినా చాలా బెటర్ గా అనిపిస్తాము అంటూ తన భార్య పల్లవితో కలిసి పోస్ట్ చేసాడు. దీనితో తన విడాకుల వార్తల వదంతులు అన్నీ అబద్దాలే అని కొట్టి పారేసినట్టు అయ్యిందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం అయితే నిఖిల్ ఈ ఏడాదిలో రెండో రిలీజ్ 18 పేజెస్ తో రెడీగా ఉన్నాడు. అలాగే ఇందులో కూడా అనుపమ పరమేశ్వరన్ నే హీరోయిన్ గా నటిస్తుంది.