Rocking star Yash : ఆయన తో జాగ్రత్తగా ఉండమన్నందుకు అవమానంగా ఫీల్ అయ్యారు…. యష్ షాకింగ్ కామెంట్స్ ఎవరి గురించో..?

 

Rocking Star Yash: ప్రస్తుతం సినీ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాలలో కే జి ఎఫ్2 సినిమా కూడా ఒకటి. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2018లో యాష్ హీరో గా ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ చాప్టర్1 సినిమా ను చిత్రీకరించారు. ఈ సినిమా కన్నడ సినీ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు తెచ్చిపెట్టిన చిత్రంగా నిలిచిపోయింది. ప్రస్తుతం కే జి ఎఫ్ చాప్టర్ వన్ కు సీక్వెల్ గా వస్తున్న కే జి ఎఫ్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది.

భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. విలన్ అధీరాగా సంజయ్ దత్ నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు.  ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది.తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది . ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేస్తుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం. ఇందులో భాగంగా బెంగుళూరులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలో హీరో యాష్ మాట్లాడుతూ, ముందుగా నటుడు పునీత్ రాజ్ కుమార్ కి నివాళులు అర్పించిన యష్.. ఆ తరువాత ‘కేజీఎఫ్2’ సినిమా గురించి మాట్లాడారు.సినిమాలో విలన్ రోల్ పోషించిన సంజయ్ దత్ గురించి గొప్పగా మాట్లాడారు యష్. ‘కేజీఎఫ్ 2’ సినిమా మొదలైన కొన్ని రోజులకే సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వెళ్లారని.. దాని నుంచి కోలుకొని వెంటనే అదే ఉత్సాహంతో సెట్ లో జాయిన్ అయి కమిట్మెంట్ తో వర్క్ చేశారని అన్నారు.

పని విషయంలో ఆయనకున్న నిబద్ధతే ఆయన్ని ఆ స్థాయిలో ఉంచిందని చెప్పారు. సంజయ్ దత్ తో యాక్షన్ సీక్వెన్స్ చేసేప్పుడు అందరిలో ఒక భయం ఉండేదని అన్నారు. ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండమని సెట్ లో అందరికీ చెబుతుంటే.. ఆయన అవమానంగా ఫీల్ అయ్యారని యష్ తెలిపారు. ఓ రోజు తనను పిలిచి ‘యష్ భాయ్ నువ్ నన్ను అలా అవమానించకు. నువ్ నా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నావని తెలుసు.. కానీ నేను నటించగలను. ది బెస్ట్ ఇస్తాను’ అని చెప్పారని.. అలానే ఇచ్చారని యష్ చెప్పుకొచ్చారు.