ఆ దెబ్బతో ఇక సినిమా ఇండస్ట్రీలో ఉండదనుకున్నాను ..కియారా అద్వానీ

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కియారా అద్వాని ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. కాని బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ రోజు ఇన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ స్టార్స్ కి జంటగా నటించే అవకాశాలు దక్కించుకుంటుందని కియారా కూడా భావించలేదంటోంది. అందుకు కారణం కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది. టాలీవుడ్ లో కియారా అద్వాని సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే సినిమాతో పరిచయమయింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Kiara Advani's Solo Dance Number From 'Indu Ki Jawani' Out Now - Telugu  Abir Sengupta Hasina Pagal Deewani Indu Jawani Advani \\'indu-TeluguStop

దాంతో కియారా కి ఇక టాలీవుడ్ లో వరసగా ఆఫర్స్ వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు .. ప్రేక్షకులు భావించారు. కాని బోయపాటి శ్రీను – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమా ఘోర పరాజయం కావడంతో ఇక మళ్ళీ టాలీవుడ్ లో సినిమా చేసే అవకాశం దక్కలేదు. అయితే ఈ సినిమా ఫ్లాప్ తర్వాత కియారా కి ఇక టాలీవుడ్ లో ఎవరూ అవకాశాలివ్వరన్న కామెంట్స్ వినిపించాయి. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ తో సంబంధం లేకుండా కియారా అవరసగా అవకాశాలు వచ్చాయి.

కాని బాలీవుడ్ లో తీరిక లేకుండా సినిమాలు చేస్తుండటంతో ఇక్కడ సినిమాలు కమిటవడానికి టైం దొరకడం లేదు. అయితే కెరీర్ ప్రారంభంలో కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందట. బాలీవుడ్ లో ఫగ్లీ అన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 2014 లో రిలీజైంది. అయితే అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. దాంతో ఇక మళ్ళీ సినిమా అవకాశాలు రావని కియారా డిసైడయిపోయిందట. కాని తనే ఊహించకుండా ధోనీ సినిమా లో నటించే అవకాశం దక్కడంతో … ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇక ఇప్పటి వరకు కియారా కెరీర్ లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు అంటోంది. కాగా త్వరలో ఇందూ కి జవాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కియారా.