రిలీజ్ కి ముందే శాకుంతలం చూపిస్తారా?

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ లో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం. కాళిదాసు రాసిన శకుంతల దుష్యంతుడి ప్రేమ కావ్యం ఆధారంగా చేసుకొని అందులో వర్ణనని దృశ్యరూపంలోకి గుణశేఖర్ తీసుకొచ్చి తెరపై ఆవిష్కరించారు. సమంత టైటిల్ ని పోషిస్తూ ఉన్న ఈ మూవీ ప్రమోషన్ ప్రస్తుతం జరుగుతుంది.

ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా ఏకంగా 80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే సినిమాపై కొంత వరకు బజ్ ఉన్న కూడా అది మూవీకి భారీ ఓపెనింగ్స్ తీసుకురావడంలో మాత్రం ఉపయోగపడదు అని చెప్పాలి. తెలుగులో కొంత వరకు దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వస్తున్న మూవీ కావడంతో హైప్ ఉంది.

అయితే ఇతర భాషలకి రీచ్ అవ్వడంలో భాగా వెనుకబడి ఉంది. అయితే సమంత మాత్రం తనకి సాధ్యమయ్యే స్థాయిలో రీతిలో ప్రమోషన్ చేస్తూ ఉంది. అయితే మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఏవీ కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి చేరువ కాలేదు. దీంతో ఇప్పుడు దిల్ రాజు సినిమాని మార్కెట్ లోకి తీసుకొని వెళ్లేందుకు మరో ప్రమోషన్ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నట్లుగా టాక్.

మేజర్, రైటర్ పద్మభూషణ్, బలగం సినిమాల తరహాలోనే ఈ మూవీకి కూడా రిలీజ్ కి ముందే ప్రీమియర్స్ ప్రదర్శించాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా మీడియా వారికి ప్రత్యేకంగా ప్రీమియర్స్ ప్రదర్శించడం ద్వారా వారే సినిమాని ప్రమోట్ చేస్తారని అంచనా వేస్తున్నారు. అలాగే సెలబ్రిటీలతో స్పెషల్ షోలు వేసి ప్రత్యేకంగా బైట్స్ ఇప్పిచడం కూడా చేయాలని అనుకుంటున్నారు. ఇలా సెలబ్రిటీల మౌత్ టాక్ తో ఆయా హీరోల అభిమానులు మూవీకి కనెక్ట్ అవుతారని అంచనా వేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో చాలా సినిమాలకి ఇలా రిలీజ్ కి ముందే పెయిడ్ ప్రీమియర్ షోలు వేస్తూ ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తున్న ప్రమోషన్స్ భాగానే వర్క్ అవుతున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చి సినిమాలకి హిట్ టాక్స్ వచ్చాయి. ఇప్పుడు శాకుంతలం సినిమాకి కూడా అదే పంథాని దిల్ రాజు ఫాలో అవ్వడానికి రెడీఅయ్యారని వినికిడి.