చిరంజీవి వేలు పెట్టకుండా సాధ్యమా.!

చిరంజీవి వేలు పెట్టారు.. ‘ఆచార్య’ పోయింది. చిరంజీవి మళ్లీ వేలు పెట్టారు.. ‘భోళా శంకర్’ కూడా పోయింది.. అంటూ ఈ మధ్య గట్టిగా ప్రచారం జరిగింది.

మరి, అదే చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’కీ వేలు పెట్టారు. అది పెద్ద హిట్టయ్యిందిగా.! చిరంజీవి స్టాయి స్టార్ హీరో అన్నాకా, ఖచ్చితంగా తాను చేస్తున్న ప్రాజెక్టుకి సంబంధించి ఇన్‌పుట్స్ ఇవ్వడం సర్వసాధారణమైన విషయం.

దాన్ని తప్పు పట్టడం, విమర్శించడం అంత కన్నా మూర్ఖత్వం ఇంకోటి వుండదు. ఆ స్థాయిలో వున్న స్టార్స్ ఇన్‌పుట్స్ ఇస్తే అవి ఖచ్చితంగా సినిమాకి అడ్వాంటేజ్ అవుతాయే తప్ప డిస్ అడ్వాంటేజ్ అయ్యే ప్రశక్తే వుండదు.

చిరంజీవి వేలు పెట్టడం వల్లే ‘భోళా శంకర్’ ఫ్లాప్ అయ్యిందన్న ప్రచారంలో ఎంత మాత్రమూ నిజం లేదు. ఇదిలా వుంటే, ఆయా సినిమాలు ఫ్లాప్ అయ్యాయ్ కాబట్టే తాజా సినిమా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ విషయంలో చిరంజీవి జాగ్రత్తగా వుంటున్నారనీ, స్ర్కిప్టు విషయంలో దూరంగా వుంటున్నారనీ వినికిడి.

అయితే, అందులోనూ ఎంత మాత్రమూ నిజం లేదని వశిష్ట సన్నిహితుల ద్వారా అందుతోన్న సమాచారం. వశిష్ట సినిమా త్వరలోనే సెట్స్ మీదికెళ్లనుంది. ఈ స్టోరీపై ప్రస్తుతం సిట్టింగ్స్ జరుగుతున్నాయ్. దాదాపు ఫైనల్ అయిపోయినప్పటికీ, చిరంజీవి నుంచి ఎప్పటికప్పుడు ఇన్‌పుట్స్ తీసుకుంటూ చిన్నా, చితకా మార్పులు చేస్తున్నాడట డైరెక్టర్ వశిష్ట.

దాంతో ఈ సబ్జెక్ట్ ఇంకా బెటర్‌గా వస్తోందనీ అంటున్నారు. చిరంజీవికి బౌన్స్ బ్యాక్ అవ్వడం కొత్తేం కాదు. కానీ, ఈ సారి రాబోయే సినిమా ‘వాల్తేర్ వీరయ్య’ను మించి యావత్ సినీ పరిశ్రమ తెలుగు సినిమాని నెక్స్‌ట్ లెవల్‌లో మాట్లాడుకునేలా చేస్తుందని అంచనా వేస్తున్నారు.