స్టార్ హీరోయిన్లంతా ఆ యాగం ఎందుకు చేస్తున్నారు?

తమ అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్లుగా మారిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే వీళ్లలో చాలా మంది తీర్థ యాత్రలకు వెళ్తుండగా.. మరికొంత మంది హీరోయిన్లు మాత్రం హోమాలు, పూజలు చేయించుకుంటున్నారు. గతంలో సమంత, నయన తార వంటి వారు అనేక పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటూ వార్తల్లో నిలవగా… తాజాగా హోమాలు చేయించుకుంటూ మీడియాకెక్కుతున్నారు.

ముఖ్యంగా బాగా పాపులర్ అయిన రాజ శ్యామల హోమం జరిపించుకుంటున్నారు. స్వయానా వాళ్ల ఇళ్లకే పూజారులను పిలిపించుకొని ఈ హోమాలు చేయించుకుంటున్నారు. కొన్ని నెలల ముందు సమంతా హైదరాబాద్‌లోని తన నివాసంలో 12 మంది పూజారులతో రాజ శ్యామల హోమం నిర్వహించింది. ఈ తర్వాత కొన్ని దేవాలయాలు, ఇతర ప్రదేశాల్లో కూడా హోమాలు జరిపించుకుంది.

ఆ తర్వాత నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రాజ శ్యామల హోమం చేయడానికి హైదరాబాద్ నుండి కర్ణాటకకు పూజారులతో నిండిన బస్సులో వెళ్లినట్లు పుకారు వచ్చింది. ఈ హోమాన్ని సాయంత్రం పూట చేస్తుంటారు. ఈ హోమం చేయడం వల్ల వ్యాపారంలో విజయవంతమైన ఫలితాలు వస్తాయని అంతా నమ్ముతారు. అంతే కాదండోయ్ శత్రువుల నుండి రక్షించబడతామని కూడా భక్తుల విశ్వాసం.

తాజాగా మరో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఇదే హోమం చేసేందుకు పూజారులను హైదరాబాద్ నుంచి ముంబైకి తీసుకెళ్లింది. ఇదే హోమం కోసం కృతి సనన్, పూజా హెగ్డే వంటి మరికొందరు స్టార్ హీరోయిన్లు వరుసలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గత నెలలో పెద్దమ్మ ఆలయంలో పూజా హోమాలు నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు అదే జరుగుతోంది.

అయితే వీరందరికీ పూజలు చేసే వాళ్లలో ముందుడే పూజారి.. వేణు స్వామి కావడం గమనార్హం. అయితే రష్మిక మందన్నా ఇంట్లో పూజలు చేసిన వేణు స్వామి.. తాజాగా నిధి అగర్వాల్ ఇంట్లోనూ ఈ రాజ శ్యామల హోమం జరిపించారు. అనంతరం ఆశీర్వాదం అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.