KKR vs PBKS: కేకేఆర్ – పంజాబ్ మ్యాచ్.. ఎక్కువ ఎఫెక్ట్ ఎవరికి?

ఐపీఎల్ 2025 సీజన్‌లో జరిగిన కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌ను వర్షం ముంచేసింది. ఈ సీజమ్ లో వర్షం కారణంగా రద్దైన మొదటి మ్యాచ్ ఇదే. ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిర్వహించిన ఈ మ్యాచ్‌ పూర్తిగా రద్దైంది. పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్ 7 పరుగులు చేసిన తర్వాత వర్షం మొదలై మ్యాచ్‌ను నిలిపివేసింది. వర్షం ఆగకపోవడంతో చివరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లు చెరో పాయింట్ సాధించాయి. పంజాబ్ కింగ్స్ 11 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మరోవైపు కేకేఆర్ 7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. పంజాబ్ గెలిచి ఉంటే ప్లేఆఫ్ రేసులో మరింత బలంగా నిలబడే అవకాశం ఉండేది. కానీ వర్షం వల్ల ఒక్క పాయింట్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (69), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (83) అద్భుతంగా ఆడి భారీ స్కోర్‌కి బడుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం అందించారు. చివర్లో కేకేఆర్ బౌలర్లు గట్టిగా పుంజుకొని పరుగుల పరిమితి పెట్టారు. వైభవ్ అరోరా రెండు కీలక వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రస్సెల్ చెరో వికెట్ తీసుకున్నారు.

ఈ మ్యాచ్ రద్దు కేకేఆర్‌కు కొంత లాభం తీసుకొచ్చినట్టే. తక్కువ పాయింట్లతో ఉన్న కోల్‌కతా టీం ఓటమి దూరం అయ్యింది. కనీసం ఒక పాయింట్ లభించడం వల్ల ప్లేఆఫ్ ఆశలు బతికించుకుంది. అయితే పంజాబ్ మాత్రం విజయానికి దగ్గరగా ఉండి, రద్దు కారణంగా వెనకబడింది. మొత్తానికి వర్షం రెండు జట్ల ప్లాన్‌లను నెగటివ్‌గా ప్రభావితం చేసింది. ఇక మిగిలిన మ్యాచ్‌ల్లో ఎవరు పాయింట్లు రాబట్టి ప్లేఆఫ్ టికెట్ దక్కించుకుంటారో చూడాలి!

ప్రభాస్ పిల్లబచ్చా || Cine Critic Dasari Vignan Reacts On Manchu Vishnu Comments On Prabhas || TR