ఆ వార్తపై నిహారిక ఏమందంటే?

మెగా డాటర్ అనే బ్రాండ్ తో టాలీవుడ్ లోకి ఒక మనసు మూవీతో హీరోయిన్ గా ఇచ్చింది నిహారిక కొనెదల. అంతకంటే ముందుగా యాంకర్ గా కూడా బుల్లితెరపై మెరిసింది. తరువాత వెబ్ సిరీస్ లతో యుట్యూబ్ లోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు క్రియేట్ చేసుకుంది. ఇక హీరోయిన్ గా అడుగుపెట్టి ఏకంగా ఐదు సినిమాల వరకు చేసింది.

అయితే అందులో ఏ ఒక్కటి కూడా కమర్షియల్ సక్సెస్ కాలేదు. నటిగా ఆమెకి మంచి మార్కులే వచ్చిన కూడా మూవీస్ మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో హీరోయిన్ గా తన ఎనర్జీకి సరిపడే పాత్రలు రావడం లేదని ఫిక్స్ అయ్యి సినిమాలు వదిలేసుకుంది. అయితే వెబ్ సిరీస్ లు మాత్రం చేస్తోంది. నిర్మాతగా ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లు నిర్మించింది.

ఇక చిన్న ఫ్యామిలీ స్టొరీ వెబ్ సిరీస్ తో సక్సెస్ అందుకుంది. తాజాగా ఆమె డెడ్ ఫిక్సల్స్ అనే వెబ్ సిరీస్ ని నిర్మించి లీడ్ రోల్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా ఓ యుట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో నిహారిక ఆసక్తికర విషయాలు పంచుకుంది.

సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, విమర్శలపై నిహారిక ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరియర్ ఆరంభంలో సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, విమర్శలు చూసి కొంత బాధపడేదాన్ని అయితే తరువాత పట్టించుకోవడం మానేసాను అని పేర్కొంది. అలాగే సైరా సినిమాలో తన క్యారెక్టర్ పై వచ్చిన మీమ్స్ చూసి తెగ నవ్వుకున్నా అని ఆమె చెప్పుకొచ్చింది. నటన మీద ఆసక్తితోనే ఇండస్ట్రీలోకి వచ్చాను నటిగా వందశాతం కష్టపడి పని చేస్తా రిజల్ట్ అనేది తరువాత ఎలా వచ్చిన తీసుకుంటా అని చెప్పింది.

అలాగే రామ్ చరణ్ త్వరలో ఒక ఐపీఎల్ జట్టుని కొనుగోలు చేస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. అది మీ దృష్టికి వచ్చిందా అని యాంకర్ ప్రశ్నించారు. అవునా ఏ టీమ్ కొంటున్నారు. ఆ విషయం అయితే నా వరకు రాలేదు. ఇంటర్వ్యూ అయిన తర్వాత అన్నయ్యని కలిసి అడుగుతాను ఏ టీమ్ ని కొంటున్నారు అనేది అని ఇంటరెస్టింగ్ గా సమాధానం చెప్పుకొచ్చింది.