కృతి శెట్టి.. ఇలా అయ్యిందేటి?

ఉప్పెన మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ కృతి శెట్టి. ఈ అమ్మడు కూడా మంగళూరు తీరం నుంచి హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిందే. దీంతో ఐశ్వర్యా రాయ్, శిల్పాశెట్టి, ఒక అనుష్క శెట్టి తరహాలో స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ భావించారు. ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో కృతిశెట్టిని ఇక ఆపడం కష్టం అని అందరూ అనుకున్నారు.

ఉప్పెన తర్వాత బంగార్రాజు మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. వెంటనే శ్యామ్ సింగరాయ్ మూవీతో మరో హిట్ కొట్టింది. హ్యాట్రిక్ విజయాలతో ఈ అమ్మడు మంచి జోరు మీద కనిపించింది. దీంతో వెంటవెంటనే అవకాశాలు వచ్చాయి. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ది వారియర్ మూవీలో నటించింది. దీంతో మొదటి ఫ్లాప్ ని ఖాతాలో వేసుకుంది.

తరువాత నితిన్ తో మాచర్ల నియోజకవర్గం మూవీతో మరో డిజాస్టర్ కొట్టింది. నెక్స్ట్ సుదీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించిన ఆడియన్స్ తిరస్కరించారు. తాజాగా కస్టడీ సినిమాకి హీరోయిన్ పాత్రనే మైనస్ అనే మాట ఆడియన్స్ నుంచి వినిపిస్తోంది. ఆమె క్యారెక్టర్ లేకుంటే మూవీ హిట్ అయ్యేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

దీంతో వరుసగా నాలుగు డిజాస్టర్స్ ని ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు చేతిలో ఒక తమిళ్, ఒక మలయాళీ మూవీ మాత్రమే ఉన్నాయి. తెలుగు హీరోలు సెంటిమెంటల్ గా భావించి కృతి శెట్టిని పక్కన పెట్టారని తెలుస్తోంది. ఆమె స్థానంలో ఇప్పుడు శ్రీలీల వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కృతి శెట్టి కోసం అనుకున్న క్యారెక్టర్స్ కి కూడా శ్రీలీలని ఫైనల్ చేస్తూ ఉన్నట్లు టాక్.

దీంతో స్టార్ హీరోయిన్ కావాల్సిన బ్యూటీ వరుస ఫ్లాప్ లతో కెరియర్ లో వెనుకబడిపోయింది అనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మరి ఆమెని తిరిగి ట్రాక్ లో పెట్టె ప్రాజెక్ట్ రావడానికి ఇంకెంత కాలం పడుతుందో వేచి చూడాలి.