ఏజెంట్ కు ఎన్ని తిప్పలో?

అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ సుంకరతో పాటు సురేందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. ఇక స్పై థ్రిల్లర్ గా హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే ఈ మూవీ టీజర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఆశించిన స్థాయిలో మూవీపై బజ్ క్రియేట్ చేయలేదు.

ఈ మూవీకి దర్శకుడు సురేందర్ రెడ్డి ముందుగా 40 కోట్ల బడ్జెట్ అనుకున్నారంట. అయితే ఇప్పుడు ఏకంగా 70 కోట్లకి చేరిందని టాక్. ఈ నేపధ్యంలో ఇప్పటికే నిర్మాత అనిల్ సురేందర్ రెడ్డిపై కోపంగా ఉన్నాడనే మాట వినిపిస్తుంది. బడ్జెట్ చెప్పినదానికంటే ఎక్కువ పెట్టడం వలన బిజినెస్ పైన కూడా ప్రభావం చూపిస్తుందని అనిల్ సుంకర భావిస్తున్నాడంట. అసలే అఖిల్ మార్కెట్ తెలుగులోనే ఆశించిన స్థాయిలో లేదు.

అలాంటిది పాన్ ఇండియా లెవల్ లో మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఆ స్థాయిలో బిజినెస్ జరుగుతుందా అనే సందేహాలు నిర్మాతకి ఉన్నాయంట. ఏప్రిల్ 28న ఈ మూవీ రిలీజ్ డేట్ ఇచ్చారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. ఈ కారణంగా ప్రమోషన్స్ కూడా సాలిడ్ గా స్టార్ట్ కాలేదు. దీంతో నిర్మాత టెన్షన్ పడుతున్నాడని టాక్. అయితే సురేందర్ రెడ్డి మాత్రం మూవీపైన చాలా నమ్మకంగా ఉన్నాడంటా. ఏప్రిల్ 1 నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని టాక్.

అయితే పాన్ ఇండియా సినిమా కావడంతో అఖిల్ ఫ్యాన్స్ కూడా మూవీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అతని కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో వస్తున్న సినిమా కావడం, అలాగే కమర్షియల్ హీరోగా అఖిల్ పాన్ ఇండియా బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి లభించిన ప్రాజెక్ట్ కావడంతో మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని నిర్మాత అనిల్ సుంకర మీద ఫోర్స్ చేస్తున్నారంట. మరి ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి ఎలాంటి ప్రమోషన్ స్ట్రాటజీతో వెళ్తారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.