చిరంజీవి కి కథ చెప్పిన మరో యంగ్ డైరెక్టర్ .. ఏమన్నాడంటే ..?

చిరంజీవి కి కథ చెప్పేందుకు ఇప్పుడు యంగ్ డైరెక్టర్ కూడా పలువురు క్యూలో ఉన్నారు. ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న వాళ్ళకే మెగాస్టార్ ఇంకా అవకాశం ఇవ్వలేదు. వాళ్ళందరు అలా క్యూలో ఉండగానే బాబీ లాంటి యంగ్ డైరెక్టర్స్ మెగాస్టార్ ని మెప్పించేందుకు కథ సిద్దం చేసుకొని టైం ఇచ్చినప్పుడు కథ వినిపిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుంది.

దాంతో నెక్స్ట్ సినిమాలని ఒక్కొక్కటిగా సెట్స్ మీదకి తీసుకు వస్తున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ సినిమా రీమేక్ లో నటించబోతుండగా ఈ నెలలోనే సెట్స్ మీదకి రాబోతోంది. ఆచార్య సినిమాకి ఇప్పటికే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మే 13 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇక లూసీఫర్ తెలుగు రీమేక్ కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో చేయబోతున్నాడు మెగాస్టార్. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించే సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి యంగ్ దర్శకుడు బాబీ దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఈ లిస్ట్ లో మరో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల వచ్చి చేరాడని తాజాగా న్యూస్ వినిపిస్తోంది. ‘ఛలో’ .. ‘భీష్మ’ సినిమాలతో వరసగా రెండు సూపర్ హిట్ సినిమాలను అందుకున్నాడు వెంకీ కుడుముల. చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని ఒక కథను తయారు చేసిన వెంకీ కుడుముల రీసెంట్ గా ఆ కథను వినిపించాడట. ఈ కథ చిరంజీవి కి బాగా నచ్చడంతో కొన్నాళ్ళు ఆగమని హోల్డ్ లో పెట్టినట్టు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో.