బాలయ్య డామినేట్ చేసినా “వాల్తేరు వీరయ్య” ఏమీ తక్కువ కాదా?

మళ్ళీ చాలా కాలం తర్వాత అయితే టాలీవుడ్ లో భారీ క్లాష్ రాబోతుంది. ఈ సంక్రాంతికి నందమూరి నటసింహ బాలకృష్ణ అలాగే మెగాస్టార్ చిరంజీవి లు తమ సినిమాలు “వీరసింహా రెడ్డి” అలాగే “వాల్తేరు వీరయ్య” సినిమాలతో రాబోతున్నారు. మరి రెండు సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉండగా ఈసారి బాలయ్య సినిమాకి కూడా భారీ బిజినెస్ జరిగింది.

ఇక దీనితో దగ్గరదగ్గర చాలా గట్టి పోటీ రెండు సినిమాలకి కూడా ఉంది. అయితే యూఎస్ లో మాత్రం రెండు సినిమాల పరిస్థితి వేరుగా ఉందని చెప్పాలి. అక్కడ చిరు సినిమా కన్నా బాలయ్య సినిమా డామినేట్ చేయడం విశేషం కాగా ఆల్రెడీ బాలయ్య సినిమా అక్కడ లక్ష డాలర్స్ క్రాస్ చేసి సెన్సేషన్ ని సెట్ చేసింది.

కానీ వాల్తేరు వీరయ్య మాత్రం ఇంకా ఈ మార్క్ దాటలేదు. అయితే ఇక్కడ వీరసింహా రెడ్డి కి ఎక్కువ స్క్రీన్స్ దక్కాయి. ఇది వరకే వీరసింహా రెడ్డి ని అక్కడి అభిమానులు ప్లాన్ చేసుకొని చిరు సినిమా కన్నా ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేసుకుంటున్నారని చెప్పాము.

మరి అందుకు తగ్గట్టే ఆ లొకేషన్స్ కి వీరసింహా రెడ్డి అదరగొడితే దానికన్నా తక్కువ లొకేషన్స్ స్క్రీన్స్ లో ఉన్న వాల్తేరు వీరయ్య కూడా గట్టి ప్రీమియర్స్ అందుకుంది. దీనితో రెండు సినిమాలు కూడా లొకేషన్స్ కి తగ్గట్టే వసూళ్లు అందుకుంటున్నాయి. ఇంకా టైం ఉంది కాబట్టి రిలీజ్ నాటికి లెక్కలు తారు మారు అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.