విశ్వక్ సేన్ ఓటీటీ ఎంట్రీ

ఇప్పుడు యంగ్ హీరోలు సినిమాలు చేస్తూనే డిజిటల్ స్పేస్ లోకి కూడా అడుగుపెట్టి తమ టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఏదైనా మంచి అవకాశం వస్తే వదులుకోవడం లేదు. ఇప్పటికే చాలా మంది అవుట్ డేటెడ్ హీరోలు ఒటీటీలోకి అడుగుపెట్టి సక్సెస్ అవుతున్నారు. సినిమాల ద్వారా రాని ఫేమ్ ని డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ఆశ్వాదిస్తున్నారు.

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో రౌడీ బాయ్ గా పాపులర్ అయిన విశ్వక్ సేన్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది దాస్ కా దమ్కీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపైన కూడా చాలా నమ్మకాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా విశ్వక్ సేన్ కి సంబంధించి ఒక అప్డేట్ తెరపైకి వచ్చింది. తెలుగు ఒటీటీ ప్లాట్ ఫామ్ ఆహా అఫీషియల్ గా విశ్వక్ సేన్ ఆహా కోసం 15 ఎపిసోడ్స్ షో చేయబోతున్నాడు అని కన్ఫర్మ్ చేసింది. ఇది పూర్తిగా ఎంటర్టైన్మెంట్ తో ఉండబోతోందని, ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని అందించేందుకు ఇది సిద్ధం అవుతోందని చెప్పారు.

దీంతో విశ్వక్ సేన్ డిజిటల్ ఎంట్రీ ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే అతను చేస్తున్నది వెబ్ సిరీస్ నా లేదంటే టాక్ షో నా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఆహా పెట్టిన ట్వీట్ బట్టి చూస్తుంటే టాక్ షో అని అర్ధమవుతోంది. ఇప్పటికే ఆహాలో సమంత, బాలయ్య టాక్ షోలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు విశ్వక్ సేన్ తో అల్లు అరవింద్ టీమ్ ఎలాంటి షో ప్లాన్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ మధ్యకాలంలో రియాలిటీ షోలు, టాక్ షోలకి ఆదరణ భాగా పెరిగింది. ఈ నేపథ్యంలో శాటిలైట్ నుంచి డిజిటల్ ఛానల్స్ వరకు అన్ని కూడా షోలపైనే ఫోకస్ చేశాయి. విశ్వక్ చేయబోయే సిరీస్ కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది.