శ్రీవారిని దర్శించుకున్న ‘గామి’ టీమ్‌!

తిరుమల శ్రీవారిని సినీ నటుడు విశ్వక్‌ సేన్‌ దర్శించుకున్నారు. బుధవారంవీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో.. ఇటీవల విడుదలైన తన ‘గామి’ చిత్ర యూనిట్‌తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.