Virat Kohli: 20 లక్షలు వచ్చినప్పుడు పట్టలేని ఆనందంలో కోహ్లీ

ఐపీఎల్ ప్రారంభానికి ముందు టీ20 ఫార్మాట్ పట్ల సందేహాలే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అదే లీగ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ వేదికగా ఎదిగింది. ఈ అభివృద్ధికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఆటగాడు విరాట్ కోహ్లీ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తొలిసారి ఐపీఎల్‌కు వచ్చాన సందర్భాన్ని, అలాగే రెమ్యునరేషన్‌ విషయాన్ని, ఆ సమయంలో తన భావోద్వేగాల గురించి పంచుకున్నారు.

2008లో జరిగిన తొలి ఐపీఎల్ వేలం సమయంలో కోహ్లీ మలేషియాలో U19 వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నాడు. వేలం విషయమై సమాచారం అందినప్పుడు RCB రూ.20 లక్షలకే తీసుకుందన్న వార్త విని ఆనందానికి అవధులు లేకుండా పోయిందని అన్నాడు. ఆ సమయంలో తన సహచరులతో కలిసి హోటల్ కారిడార్‌లో “మనకి రూ.20 లక్షలు వచ్చాయ్!” అంటూ సంబరాలు చేసుకున్నానంటూ తన మొదటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.

అప్పట్లో తాను ఫ్రాంచైజీ క్రికెట్ అంటే ఏమిటో కూడా అంతగా అర్థం చేసుకోలేకపోయానని, కానీ ఐపీఎల్ ద్వారా ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి ఆడే అరుదైన అవకాశం దక్కిందని చెప్పుకొచ్చాడు. ఆ ప్రయాణం ఇప్పటికి 18 ఏళ్లయ్యిందని, ప్రతి ఏడాది ఈ లీగ్ మరింతగా ఎదుగుతూ ముందుకు సాగుతుందని గర్వంగా తెలిపారు. ఈ సీజన్‌లో కోహ్లీ రేటు ఏకంగా రూ.21 కోట్లు. అంటే 20 లక్షల నుండి 21 కోట్ల వరకూ వచ్చిన ప్రయాణం నిజంగా మరిచిపోలేని వన్ మ్యాన్ స్టోరీ.

ఇద్దరి డాక్టర్లు మధ్య జరిగింది ఇదే | Dasari Vignan On Beauty Clinics Scam HK Permanent Makeup Clinic