వైరల్ : బ్లూ టిక్స్ పోగొట్టుకుంటున్న సెలెబ్రెటీలు.!

ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి ఆల్ మోస్ట్ అందరి సెలెబ్రెటీస్ కూడా సోషల్ మీడియాలో ఉన్నవారే అని తెలిసిందే, అలాగే దాదాపు అన్ని సోషల్  ప్లాట్ ఫామ్స్ లో కూడా వారు ఉన్నారు. ఇక ఇప్పుడు రోజులు మారుతూ ఉండడంతో తమ ఫేమ్ తో సోషల్ మీడియాలో వెరిఫై అయ్యి అధికారిక గుర్తింపు తెచ్చుకున్న వారికి కూడా ఇప్పుడు ఆ సోషల్ మీడియా యజమానులు డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు.

ఇక రీసెంట్ గానే ట్విట్టర్ లో అయితే బ్లూ టిక్స్ కొనుకోవాల్సిందే అని ఆ ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ సెన్సేషనల్ నిర్ణయం తీసుకోవడంతో గందరగోళం నెలకొంది. ఇక లేటెస్ట్ గా అయితే ఒకేసారి మన దక్షిణాదికి చెందిన అనేకమంది సినీ తారలు తాలుకా బ్లూ టిక్స్ మాయం అవ్వడం స్టార్ట్ అయ్యాయి.

దీనితో నిన్న రాత్రి మొదలుకొని తెల్లవారు నుంచే తమ ట్విట్టర్ కి ఏమైంది అని ఒకోకరు మాట్లాడుతున్నారు. మరి ఈ టిక్స్ పోగొట్టుకున్న వారిలో నాచురల్ స్టార్ నాని, షారుఖ్ ఖాన్, హీరోయిన్ నిధి అగర్వాల్, నటి కుష్బూ, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ ఇంకా అనేకమంది నటులు ప్రముఖులు ఉన్నారు.

అయితే కుష్బూ తన ప్లాన్ ఇంకా యాక్టీవ్ లో ఉన్నప్పటికి కూడా బ్లూ టిక్ పోయింది అని వాపోతున్నారు. దీనితో ఇప్పుడు ట్విట్టర్ అంతా బ్లూ టిక్స్ గోలతో నిండిపోయి హ్యాష్ టాగ్ కూడా వైరల్ గా మారింది.