రజినీకాంత్, సూర్య వదిలేసుకున్న సినిమా విక్రమ్ దగ్గరకి?

actor-chiyaan-vikram-lcxy2hunzvo58l80

సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్న హీరోస్ లో నటన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు చాలా మందే ఉన్నారు. మరి ఈ హీరోస్ లో అయితే ఒప్పుకుని తీరాలి తమిళ ఇండస్ట్రీ నుంచే ఎక్కువ అని చెప్పడంలో సందేహం లేదు. కాగా ఆ హీరోస్ లో అయితే విలక్షణ హీరో సూర్య మరియు విక్రమ్ లు కూడా ఒకరు.

చాలా సినిమాల్లో ఎన్నో ప్రయోగాత్మక గెటప్స్ చేసిన తాము ఇప్పుడు వారి వారి భారీ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే లేటెస్ట్ గా సినీ వర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ తెలిసింది. ఇప్పుడు విక్రమ్ చేసిన చిత్రాల్లో ఓ సినిమా అయితే మొదట సూర్య మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ ల దగ్గరకి వెళ్లిందట.

తమిళ నాట సూర్య సన్నాఫ్ కృష్ణన్/ఏమాయ చేసావే ఇంకా ఎన్నిఎన్నో క్లాసిక్ చిత్రాలు చేసిన దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఇప్పుడు విక్రమ్ హీరోగా చేసిన సినిమానే “దృవ నట్చిత్రం”. తెలుగులో దీనిని ధృవ నక్షత్రంగా తీసుకొస్తున్నారు. కాగా ఈ సినిమా అసలు మొదటిగా తాను రాసుకుంది సూర్య కోసం అట.

కానీ సూర్యకి కథ నచ్చలేదు అని చెప్పడంతో గౌతమ్ మీనన్ రజని కాంత్ ని కొన్ని మార్పులు అతని ఇమేజ్ కి తగ్గట్టుగా చేసి తీసుకెళ్తే తాను కూడా ఓకే చేయలేదట. దీనితో ఫైనల్ గా విక్రమ్ దగ్గరకి వెళ్తే అప్పుడు తాను కథ ఓకే చేయగా సినిమా పట్టాలెక్కింది అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అదేంటో కానీ వారు రిజెక్ట్ చేసిన సినిమా ఎప్పుడో 2017 లో ఆలా మొదలైతే ఇప్పుడు రిలీజ్ కి రాబోతుంది.