రాజమౌళి – మహేష్ కాంబోలో రాబోయో సినిమాకి విజయేంద్ర ప్రసాద్ రాస్తున్న కథ ఇదే ..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా జీ.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘ సర్కారు వారి పాట ‘. పరశురాం దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతమందిస్తున్నాడు. జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

It's time Sarkaru Vaari Paata changes the route - tollywood

ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్ధిక నేరస్తుడిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. దేశంలో జరుగుతున్న బ్యాంక్ కుంభకోణం బ్యాక్ డ్రాప్ లో పరశురాం ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడని అంటున్నారు. యూనివర్సల్ పాయింట్ తో తెరకెక్కే ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో నిర్మిస్తున్నారట. తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Has Eros International Got SS Rajamouli On Board In Their Joint Venture  With KV Vijayendra Prasad?

కాగా ఈ సినిమా తర్వాత మహేష్ బాబు – దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక పాన్ ఇండియన్ సినిమా రూపొందబోతోంది. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై డా. కే.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ – రాం చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే రెండు పాత్రలకి సంబంధించిన టీజర్స్ అటు నందమూరి అభిమానులు ఇటు మెగా అభిమానుల తో పాటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ విషయం ఇద్దరు వెల్లడించారు. కాగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సిద్దం చేస్తున్నారట. ఈ సినిమా ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా తెరకెక్కనుందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఇలాంటి సినిమాలు చాలానే చేశారు. కాని మహేష్ గనక ఈ కథ ఒప్పుకుంటే మాత్రం భారీ అంచనాలు నెలకొనడం ఖాయం అంటున్నారు.