చిరంజీవికి కరోనా.. విజయశాంతి రియాక్షన్ వైరల్

మెగాస్టార్ చిరంజీవికి కరోనా అనే వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే కరోనా నిర్దారణ అయ్యే ముందు రోజే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఇతర మంత్రులను చిరంజీవి కలిశాడు. సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ అంటూ రామ్ చరణ్, చిరంజీవిలను కలిశాడు. అంతే కాకుండా చిరంజీవి వెంట నాగార్జున కూడా ఉన్నాడు.

Vijayashanthi About Chiranjeevi Tests Corona virus Positive
Vijayashanthi About Chiranjeevi Tests Corona virus Positive

తనకు కరోనా పాజిటివ్ అంటూ చిరంజీవి ప్రకటించిన తరువాత అందరి గుండెల్లో గుబులు మొదలైంది. ‘ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను’ అని చిరు ట్వీట్ చేశాడు.

Vijayashanthi About Chiranjeevi Tests Corona virus Positive
Vijayashanthi About Chiranjeevi Tests Corona virus Positive

ఇక చిరంజీవికి కరోనా అని తేలడంతో సినీ రాజకీయ ప్రముఖులందరూ హోం క్వారంటైన్‌కు పరిమితమైనట్టు తెలుస్తోంది. నాగార్జున ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకున్నాడని తెలుస్తోంది. ఇక చిరంజీవి త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ సెలెబ్రిటీలందరూ కోరుకుంటున్నారు. తాజాగా విజయశాంతి ట్వీట్ చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవి గారు త్వరగా కోలుకోవాలి అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.