విజయ్ దేవరకొండ కొత్త స్ర్టాటజీ.!

రౌడీ అని ముద్దుగా పిలిపించుకునే విజయ్ దేవరకొండలో చాలా చాలా మార్పు వచ్చేసింది. ఇకపై అగ్రెసివ్ ప్రమోషన్లు చేయకూడదని విజయ్ దేవరకొండ డిసైడ్ అయ్యాడట.

‘లైగర్’ ఎఫెక్ట్‌తోనే విజయ్ దేవరకొండలో ఇంత పెద్ద మార్పు. తాజా సినిమా ‘ఖుషి’ ప్రమోషన్ల విషయలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడట. కామ్ అండ్ కంపోజ్డ్‌గా మాత్రమే ప్రమోషన్లు చేయాలనుకుంటున్నాడట.

తెలుగు రాష్ట్రాట్లో అయితే, విరివిగా టూర్స్ వేస్తాడట. కానీ, నార్త్‌లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితులు లేవని తెలుస్తోంది. అయితే, ‘ఖుషి’ ప్రచార చిత్రాలతోనే మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఈ బజ్‌ని అలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నాడట విజయ్ దేవరకొండ. ఆచి తూచి వ్యవహరిస్తున్నాడట. ప్రమోషన్స్ టీమ్‌ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాడట. సైలెంట్‌గానే ప్రమోషన్లు కానిచ్చేయాలనీ అనుకుంటున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే విజయ్‌ దేవరకొండని అభినందించాల్సిందే.