ఏడేళ్ల క్రితం చిగురించిన ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న విఘ్నేష్ శివన్.. పోస్ట్ వైరల్?

Lady Super Star Nayanthara

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల ప్రముఖ తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకున్న ఈ జంట ఇటీవల ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇదిలా ఉండగా నయనతార విగ్నేష్ మొదటగా ఎక్కడ కలుసుకున్నారో తెలుసా..? వీరిద్దరూ మొదటగా 2015లో వచ్చిన “నానుమ్ రౌడీ ధాన్” అనే సూపర్ హిట్ సినిమా షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. హీరో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు విగ్నేష్ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా షూటింగ్ సమయంలో విగ్నేష్ నయనతార మధ్య ఏర్పడిన పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది. అలా ఈ సినిమా షూటింగ్ సమయంలో మొదలైన వీరి ప్రేమ ఇటీవల ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇలా ఏడేళ్లపాటు రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ నాలుగు నెలల క్రితం వివాహం చేసుకొని ఇటీవల కవల పిల్లలకు కూడా జన్మనిచ్చారు. ఈ సినిమా ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విగ్నేష్ ఇటీవల ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశాడు.

ఈ పోస్ట్ లో ఆ సినిమా షూటింగ్ సమయానికి సంబంధించిన ఒక వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో నయనతార విగ్నేష్ ఇద్దరు కూడా చాలా సరదాగా నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ” ఒకప్పుడు పాండీవుడ్‌లో… నాకు జీవితంలో అన్నింటినీ ఇచ్చిన సినిమా.. ఏడేళ్ల మధుర జ్ఞాపకం.. థ్యాంక్యూ ధనుష్‌ సార్‌’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇలా ఈ సినిమా విగ్నేశ్ కెరీర్ కి మంచి హిట్ ఇవ్వటమే కాకుండా ఈ సినిమా వల్ల నయనతార కూడా తన జీవితంలోకి అడుగుపెట్టింది. అందువల్ల ఈ సినిమా తనకెంతో స్పెషల్. ప్రస్తుతం విఘ్నేష్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.