సైంధవ్తో మరోసారి తన అభిమానులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం వెంకీ కెరీర్ లోనే అత్యంత ఖరీదైన సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, నగర శివార్లలో భారీ సెట్ని వేశారు.
కథానాయికగా మొదట సాయి పల్లవి, శ్రీనిధి శెట్టి పేర్లు చర్చల్లోకి రాగా.. మళ్ళీ ఇప్పుడు మరొకరిని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ పాత్ర కోసం శ్రద్ధా శ్రీనాథ్ని ఖరారు చేశారని సమాచారం. ఇక సినిమాలో వెంకటేష్, శ్రద్ధా మధ్య రొమాంటిక్ ట్రాక్ అంతగా ఏమి ఉండదట. అయితే ఈ నటి ఈ ప్రాజెక్ట్లో భాగం కావడానికి ముందుగానే డేట్స్ కూడా ఇచ్చిందని, లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తోందని టాక్.
శ్రద్ధతో పాటు మరో ఇద్దరు కథానాయికలు కూడా ఈ సినిమాలో కనిపించనుండగా.. వారి పాత్రలు మరింత డిఫరెంట్ గా ఉంటాయని తెలుస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీని మేకర్స్ ఎంచుకున్నారు.
ఇక విమర్శకుల ప్రశంసలు పొందిన హిట్తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన దర్శకుడు శైలేష్ కొలను ఆ తరువాత సీక్వెల్ తో కూడా మరో హిట్ అందుకున్నాడు. ఇక ఈ చిత్రానికి కూడా అతను సాంకేతిక నిపుణుల బృందాన్ని రిపీట్ చేస్తున్నాడు. ఆకట్టుకునే లైనప్తో, సైంధవ్ ను సంవత్సరం స్పెషల్ గా హైలెట్ చేయబోతున్నారని తెలుస్తోంది.