ఇన్సైడ్ టాక్ : క్రేజీ డైరెక్టర్ తో వెంకీమామ మరో థ్రిల్లర్ రీమేక్.?

ఇప్పుడు ప్రస్తుత టైం లో కూడా తెలుగు సహా హిందీ సినిమాలో కూడా ఇంకా రీమేక్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తెలుగు నుంచి అయితే పవన్ కళ్యాణ్, చిరంజీవి వెంకీ మామ ఈ లిస్ట్ లో ఉంటే రీసెంట్ గానే నాగార్జున కూడా ఓ మలయాళ సినిమాని తెలుగులో “నా సామిరంగా” గా రీమేక్ చేస్తూ సిద్ధం అవుతున్నాడు.

ఇక ఇదిలా ఉండగా ఈ స్టార్ హీరోస్ లో వెంకీ మామ ఇపుడు మరో క్రేజీ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇపుడు చేస్తున్న సినిమా కాకుండా వెంకీ మామ చేసిన హిట్ చిత్రాల్లో దృశ్యం సిరీస్ కూడా ఒకటి. అయితే దృశ్యం 1 కన్నా దృశ్యం 2 పెద్ద హిట్ అయ్యింది.

కాగా దృశ్యం 2 చిత్రాన్ని దాని ఒరిజినల్ సృష్టికర్త అయినటువంటి మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ నే తెలుగులో కూడా చేశారు. మరి మలయాళంలో ఆ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించగా ఆ సినిమా తర్వాత జీతూ చేసిన లేటెస్ట్ మరో థ్రిల్లర్ సినిమానే “నేరు”. ఇది కూడా మలయాళంలో మొన్ననే క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది.

అయితే దీనిని ఇప్పుడు వెంకీ మామ హీరోగా చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిని కూడా జీతూ జోసెఫ్ నే దర్శకత్వం వహిస్తారని ఇన్సైడ్ టాక్. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ పై ఓ అధికటిక క్లారిటీ త్వరలోనే వస్తుందని కూడా వినికిడి. మరి మొత్తానికి ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు పడుతుందో చూడాలి.