“వీరసింహా రెడ్డి” లో హాట్ టాపిక్ గా ఆమె నటన.!

ఈరోజు టాలీవుడ్ లో ఎన్నో అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ అయ్యిన టాలీవుడ్ చిత్రం “వీరసింహా రెడ్డి”. మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మరి ఈ భారీ ఫ్యాక్షన్ సినిమా అయితే మొదటి ఆట నుంచే కాస్త అటు ఇటు టాక్ తెచ్చుకున్నా నెక్స్ట్ మాత్రం అంతకంతకు పాజిటివ్ గా మారుతూ వస్తుంది.

దీనితో ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి పెరగగా ఈ సినిమాలో బాలయ్య నటనతో పాటుగా మరో నటి పెర్ఫామెన్స్ కోసం అందరిలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆమె ఇంకోవరో కూడా కాదు వెర్సటైల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈ నటి తమిళ్ లో ఎన్నో సినిమాలు చేసింది.

టాలీవుడ్ లో అయితే నటిగా ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని చిత్రం క్రాక్ తోనే భారీ బ్రేక్ అందుకోగా మళ్ళీ ఈ సినిమాకి కూడా ఆమెకి అవకాశం ఇచ్చాడు. అయితే ఈమె ఈ చిత్రంలో కూడా మరింత మంచి నటనతో ఒకొక్కరని షాక్ కి గురి చేసిందట.

దీనితో ఇప్పుడు వరలక్ష్మి కోసం సోషల్ మీడియాలో చర్చగా మారింది. సినిమాలో ఆమె ఏ రేంజ్ లో నటించగలదో చూపించారని ఆమెపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనితో అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వరలక్ష్మి శరత్ కుమార్ పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.