వెడ్డింగ్‌ బెల్స్‌… ఇటలీకి పయనమైన వరుణ్‌.. లావణ్య!

టాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌ తేజ్‌ కొణిదెల, లావణ్య త్రిపాఠివివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. జూన్‌లో అంగరంగ వైభవంగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ జంట.. నవంబర్‌ 1వ తేదీన ఇటలీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేసుకున్నారు.

ఈ వేడుకకు అల్లు, మెగా కుటుంబంతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని తెలిసింది. ఈ మేరకు పెళ్లికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో ఈ జంట ఇటలీ పయనమై వెళ్లింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కాబోయే కొత్త జంట కెమెరా కంటికి చిక్కింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. పెళ్లి తంతులో భాగంగా అక్టోబర్‌ 30వ తేదీన మెహందీ, హల్దీ వేడుకలు జరగనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. ఇక 1వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. అనంతరం నవంబర్‌ 5వ తేదీన మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో వీరి వివాహ రిసెప్షన్‌ జరగనుంది. ఇక వీరి వెడ్డింగ్‌ కార్డ్‌ ఇప్పటికే సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతోంది.

ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్‌ సినిమాలో తొలిసారి వరుణ్‌, లావణ్యలు కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడిరది. ఆ మరుసటి ఏడాది అంతరిక్షం సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఇక అప్పటి నుంచి వీళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది.

కాగా ఎంతో కాలంగా వీరిద్దరూ వాళ్ల ప్రేమను గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. వీళ్ల రిలేషన్‌ పై ఎన్ని వార్తలు వచ్చిన వీరిద్దరూ ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. చివరికి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇలా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.