‘ఆదికేశవ’థియేట్రికల్‌ ట్రైలర్‌ వచ్చేసింది…

‘అందరికీ నచ్చే సినిమా చేయడానికి మేమంతా ఎంతో కష్టపడ్డాం. ట్రైలర్‌ మాదిరిగానే సినిమా కూడా అందరినీ మెప్పిస్తుందని నా నమ్మకం’ అన్నారు పంజా వైష్ణవ్‌ తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’. శ్రీలీల కథానాయిక. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎస్‌.నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా వైష్ణవ్‌తేజ్‌ మాట్లాడారు. యాక్షన్‌, ఎమోషన్స్‌, కామెడీ అన్నీ ఉన్న సినిమా ఇదని, ఈ ఏడాది విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల తర్వాత వస్తున్న పర్‌ఫెక్ట్‌ మాస్‌ సినిమా ఇదని, ఈ నెల 24న గ్రాండ్‌గా చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత నాగవంశీ అన్నారు. రాధిక, జోజు జార్జ్‌, అపర్ణాదాస్‌, సుదర్శన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవి ప్రకాశ్‌కుమార్‌. కెమెరా: డడ్లీ, సమర్పణ: శ్రీకర స్టూడియోస్‌.