ఉప్పెన హీరోయిన్ కి రాం చరణ్ కావాలి.. అందుకే అలా మాట్లాడిందట ..?

టాలీవుడ్ లోకి దూకొస్తున్న మరో క్యూట్ అండ్ యంగ్ బ్యూటి కృతి శెట్టి. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని “నీ కన్ను నీలి సముద్రం” అన్న సాంగ్ వీపరీతంగా ట్రెండ్ అయింది. ఈ ఒక్క సాంగ్ తోనే కృతి శెట్టి కుర్రాళ్ళకి తెగ నచ్చేసింది.

Uppena to aim for Arya release date - tollywood

మెగా ఫ్యామిలీ హీరోతో ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది కాబట్టి అందరి ఫోకస్ కృతి మీదే పడింది. ఇక కుర్రాళ్ళైతే ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండా ఫ్యాన్స్ అయిపోయారు. సుకుమార్ – మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. ఇక మెగా మేనల్లుడు డెబ్యూ సినిమా కాబట్టి ఖచ్చితంగా థియోటర్స్ లోనే రిలీజ్ చేయాలని డిసైడయ్యారు. కాగా హీరోయిన్ కృతి శెట్టి కి ఈ లోపు మరో సినిమా ఆఫర్ వచ్చేసింది.

నేచురల్ స్టార్ నాని నటించబోతున్న శ్యామ్ సింగ్ రాయ్ సినిమలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా ఒక హీరోయిన్ సాయి పల్లవి.. ఒక హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభమవబోతోంది. కాగా కృతి శెట్టి ఇప్పటి వరకు మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన అన్ని సినిమాలని చూసిందట. చరణ్ అంటే తెగ ఇష్టం అని చెబుతోంది. అంతేకాదు చరణ్ కి పెద్ద ఫ్యాన్ అని చెబుతోంది. మొత్తానికి కృతి శెట్టి ఏకంగా చరణ్ సినిమాలో ఛాన్స్ కోసం బాగానే ట్రై చేస్తుందని చెప్పుకుంటున్నారు.