చిరంజీవి ని ఆ విషయం లో ఒప్పించేటప్పుడు ఏం జరిగింది అంటే ఉప్పెన డైరెక్టర్.

చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్ లో సీనియర్ హీరో మాత్రమే కాదు.. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కూడా. దాసరి నారాయణ రావు గారి తర్వాత మెగాస్టార్ చిరంజీవి అన్న విషయాన్ని పక్కన పెట్టి ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తూ అందరికీ తన అభయ హస్తాన్ని అండగా పెడుతున్నారు. చిన్న హీరో పెద్ద హీరో అని బేధ భావం చూపించకుండా ప్రతీ ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీకి కొత్తవాళ్ళు రావడానికి ప్రోత్సహిస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ హీరోలలో ఎవరితో దర్శక, నిర్మాతలు సినిమాలు తీయాలన్నా ఖచ్చితంగా చిరంజీవి కి కథ చెప్పి ఆయన సలహాలు తీసుకుంటున్నారు.

కథ విన్న చిరంజీవి కథలో ఎలాంటి అంశాలు తోడైతే బావుంటుంది.. ఆ అంశాలు హీరో ఇమేజ్ కి ఎంతవరకు కలిసి వస్తాయి లాంటి ఎన్నో విషయాలను చెప్పి సినిమా సక్సస్ కి కారణం అవుతున్నారు. ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా కథ విషయంలో బుచ్చిబాబు సానా కి మెగాస్టార్ ఎన్నో సలహాలిచ్చారట. ఈ విషయాన్ని బుచ్చిబాబు స్వయంగా వెల్లడించాడు. దర్శకుడిగా సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయం అవుతూ ఉప్పెన సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జంటగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అయింది.

అయితే దర్శకుడు బుచ్చిబాబు లెజెండ్ అయిన మెగాస్టార్ ముందు కూర్చొని కథ చెప్పడం గొప్ప అనుభం అని తెలిపాడు. అయితే ఆయనకి కథ చెప్పడానికి మాత్రం వారం రోజులు ప్రిపేర్ అయ్యాడట. వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత చిరంజీవికి కథ చెప్పగా ఎంతో ఓపికగా కథ విన్న చిరంజీవి అభినందిస్తూ షూటింగ్ మొదలు పెట్టమని ఎంకరేజ్ చేశాడట. తాజాగా ఈ అనుభూతిని అభిమానులతో పంచుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. కాగా ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ గెస్ట్ గా వచ్చి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సినిమా ఈ నెల 12 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.