“గుంటూరు కారం” మూడో సాంగ్ పై ట్రోల్స్.. 

రానున్న టాలీవుడ్ సంక్రాంతి మూవీ ఫెస్టివల్ లో ఉన్న పలు భారీ అండ్ అవైటెడ్ చిత్రాల్లో సెన్సేషనల్ కాంబినేషన్ మహేష్ బాబు అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి. కాగా ఈ చిత్రంలో ఇద్దరు యంగ్ హీరోయిన్స్ నటిస్తుండగా వారిలో రీసెంట్ సెన్సేషన్ శ్రీలీల కూడా ఒకరు.

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్కా మాస్ పాత్ర చేస్తుండగా దర్శకుడు త్రివిక్రమ్ కూడా మహేష్ ని ఊహించని లెవెల్లో ప్రెజెంట్ చేస్తున్నట్టుగా ఇవాళ రిలీజ్ చేసిన సాంగ్ ప్రోమోలో చూస్తే అర్ధం అవుతుంది. అయితే ఈ సాంగ్ ని ఫేమస్ డైలాగ్ కుర్చీ మడత పెట్టి.. అనే లైన్ తో రిలీజ్ చేయగా మహేష్ బాబు ఇంకా హీరోయిన్ శ్రీలీల తమ మాస్ తో రెచ్చిపోయారు.

దీనితో చాలా మంది ఒక్కసారిగా షాకయ్యారు. కాగా ఈ సాంగ్ తో మహేష్ బాబు త్రివిక్రమ్ లు దిగజారిపోయారు అని బూతులతో సాంగ్ ఏంటని ఓహో చాలా మందే సూక్తులు చెప్తున్నారు ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకా మహేష్ బాబు నుంచి అయితే అసలు ఈ తరహా సాంగ్ ఊహించలేదని కూడా అనేస్తున్నారు.

రొటీన్ గా చేస్తే వెళ్ళీ తిడతారు సరే ట్రెండ్ కి తగ్గట్టుగా ట్రై చేసినా ట్రోల్స్ చేసేది వీళ్ళే.. మొత్తానికి అయితే ఈ సాంగ్ బిట్ మాత్రం ఇప్పుడు మిక్స్డ్ గానే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఫుల్ సాంగ్ వచ్చాక ఎలా ఉంటుంది అనేది చూడాలి. అన్నట్టు ఈ సినిమాకి సంగీతం థమన్ అందిస్తున్న సంగతి విదితమే.