శ్రీలీలకి ప్రమోషన్.! అంతా గురూజీ ఎఫెక్ట్.!

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీ నుంచి బుట్టబొమ్మ పూజా హెగ్దే తప్పుకోవడంతో, ఆ సినిమా గురించి ఓ తాజా రూమర్ చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో పూజా హెగ్ధే మెయిన్ లీడ్ హీరోయిన్ కాగా, శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, పూజా హ్యాండిచ్చేయడంతో శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయిపోయిందనేదే ఆ రూమర్ తాలూకు సారాంశం కాదు కాదు, ఆ ప్లేస్‌ని సంయుక్త మీనన్‌తో రీప్లేస్ చేయబోతున్నారట అంటూ ఇంకో గాచిప్ వేడి వేడిగా గుప్పుమంటోంది.

అంతా బాగానే వుంది కానీ, ఎవరిని మెయిన్ హీరోయిన్ చేయాలన్నది గురూజీ త్రివిక్రమ్ చేతుల్లోనే వుంటుంది. ఆయన చల్లని చూపు ఎవరి మీదుంటే వాళ్లే మెయిన్ హీరోయిన్ మరి.

ఇప్పుడీ ఇద్దరు భామల హవా టాలీవుడ్‌లో బాగా నడుస్తోంది. సో, ఇద్దరూ కలిసి ఒకే ప్రాజెక్ట్‌లో వున్నారంటే, ఆ ప్రాజెక్ట్‌కి వెయిట్ ఖచ్చితంగా పెరుగుతుంది. గురూజీనా.! మజాకానా.! ఆయన స్కెచ్ వేస్తే అట్లుంటది.!