Mahesh Babu : మహేష్, త్రివిక్రమ్ సినిమా లో ఆ మలయాళం హీరో… సినిమా పనులను చక చకా పూర్తి చేస్తున్న గురూజీ…!

Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా విడుదల కోసం సిద్ధం అవుతున్నారు. ఇక ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా ఇంకా చిన్న చిన్న పనులు ఉండటంతో విడుదల జాప్యం జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు.దాదాపు 11ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ గురూజీ దర్శకత్వంలో నటించబోతున్నాడు మహేష్. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ తో త్రివిక్రమ్ సినిమా రాబోతోంది.

ఇక మహేష్, గురూజీ కాంబినేషన్ ఎపుడో రావాల్సింది అయితే మధ్యలో ఇద్దరు వేరే ప్రాజెక్ట్స్ తో ఉండటం వల్ల సినిమా sets పైకి వెళ్ళలేదు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పని డైలాగ్స్ ఎపుడు త్రివిక్రమ్ పూర్తి చేశారట. ఇక థమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఇక థమన్ కూడా ఆల్రెడీ కొన్ని పాటలను సీఐ ఏమైంది కోసం సిద్ధం చేశారట. ఎలా ప్రీ వర్క్ అంత పూర్తి చేశారట దీంతో ఇక సినిమా షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట.

సినిమా కోసం త్రివిక్రమ్ 8ఎకరాల్లో భారీ సెట్ కూడా నిర్మిస్తున్నారని సమాచారం. ఇక సినిమాలో మహేష్ తో పాటు మరో కీలక పాత్రకోసం ఇద్దరు మలయాళం హీరోలను గురూజీ అనుకుంటున్నారట. వీరిలో ఒకరిని సినిమా కోసం ఎంపిక చేయాలని భావిస్తున్నారట త్రివిక్రమ్.క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరోలు పృథ్వీరాజ్ సుకుమారన్ కానీ, ఫహాద్ ఫాజిల్‌ను కానీ తీసుకోబోతున్నారట. ఇప్పటికే త్రివిక్రమ్ వాళ్లతో చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే వేరే ఇండస్ట్రీల నటులను తీసుకుంటున్నారని సమాచారం.