స్టైలిష్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఓపిక మీద ప్రయాణిస్తున్నాడనే చెప్పాలి. ‘గుంటూరు కారం’ విడుదలై దాదాపు ఏడాదయ్యే సరికి, ఆయన తదుపరి సినిమా ఎప్పుడు? అనే చర్చలు సినీ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. అల్లు అర్జున్తో ప్లాన్ చేసిన సినిమా ఆలస్యం కావడంతో త్రివిక్రమ్ కు గ్యాప్ ఏర్పడింది. ఈ ఖాళీలో ఇంకెవరితోనైనా సినిమా చేస్తారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
వెంకటేష్తో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నారన్న వార్తలు వైరల్ అయినా, అవి కాస్త అదేపనిగా ఊహలే అని తేలిపోయింది. త్రివిక్రమ్ రచయితగా వెంకటేష్కి పనిచేసినప్పుడు మంచి బాండింగ్ ఏర్పడినా, దర్శకుడిగా ఇప్పటివరకు వారి కాంబో సెటవ్వలేదు. ఈసారి అయినా కలసి వస్తారనుకున్నా, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రావడం లేదు.
అదే తరహాలో రామ్ పోతినేనితోనూ ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చేస్తారని టాక్ ఉన్నా, త్రివిక్రమ్ టీం దాన్ని ఖండించింది. త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీ కోసం స్క్రిప్ట్ను డెవలప్ చేయడమే పనిగా పెట్టుకున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకూ ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. అంటే మినిమమ్ ఏడాది టైమ్ గ్యాప్ ఉండేలా ఉంది. కానీ త్రివిక్రమ్ మాత్రం ఈ గ్యాప్ను సద్వినియోగం చేసుకుంటూ, బౌండెడ్ స్క్రిప్ట్ను మరింతగా మెరుగు పరచాలని చూస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విజయాల కోసం దర్శకులు కథకు ఎక్కువ సమయం కేటాయించే ట్రెండ్ నడుస్తోంది. త్రివిక్రమ్ కూడా అదే దారిలో నడుస్తున్నాడు.