Mahesh: మహేష్ బాబు సినిమా కోసం భారీ ప్లాన్ వేస్తున్న త్రివిక్రమ్…!

Mahesh : ప్రస్తుతం మహేష్ బాబు  ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఫైనల్ గా మే 12న ప్రేక్షకుల ముందుకు రానునట్లు దర్శకనిర్మాతలు అనౌన్స్ చేశారు.అయితే సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ చేసే సినిమాల గురించి ఇపుడే చర్చలు మొదలు అయ్యాయి.రాజమౌళి మహేష్ సినిమా, త్రివిక్రమ్ మహేష్ సినిమా లైన్ లో వున్నాయ్.

త్రివికారం మహేష్ కాంబినేషన్ మీద అంచనాలు ఎక్కువగా ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా అవుతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా మంచి విజయాలు సాధించాయి. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ‘అల.. వైకుంఠపురములో’ సినిమా తరువాత ఇప్పటివరకు మరో సినిమాను మొదలుపెట్టలేదు. మధ్యలో ‘భీమ్లానాయక్’ సినిమాకు మాటలు-స్క్రీన్ ప్లే అందించారు.

ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా త్రివిక్రమ్ ఓ భారీ సెట్ ను నిర్మించబోతున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో దాదాపు ఎనిమిది ఎకరాల్లో మాసివ్ సెట్ ను నిర్మించబోతున్నారట.ఇదొక కాలనీ సెట్ అని,సినిమాలో ఎక్కువ భాగం ఈ కాలనీ సెట్లోనే చిత్రీకరించబోతున్నారు అని సమాచారం. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిత్రీకరించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించబోతున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు.