తమన్ ని పక్కన పెడుతున్న త్రివిక్రమ్?

సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మలయాళీ యాక్టర్ జయరామ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ మూవీ కథాంశం పల్నాడు బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మిర్చి యార్డ్ బ్యాక్ డ్రాప్ ని ఎస్టాబ్లిష్ చేశారు. దీనిని బట్టి కథ కచ్చితంగా హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉండబోతుంది అని భావిస్తున్నారు. అలాగే పొలిటికల్ టచ్ కూడా కథలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మూవీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ని త్రివిక్రమ్ తీసుకున్నారు. అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలతో తనకి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ని తమన్ అందించారు. ఈ నేపధ్యంలో సూపర్ స్టార్ చిత్రానికి కూడా అతనినే రిపీట్ చేశారు.

అయితే ప్రస్తుతం తమన్ ఈ మూవీ కోసం ఇచ్చిన ట్రాక్స్ త్రివిక్రమ్ కి అస్సలు నచ్చలేదని టాక్. ఈ నేపధ్యంలో ఈ మూవీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా మార్చాలని త్రివిక్రమ్ ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. తమన్ స్థానంలో అజ్ఞాతవాసితో తనకి సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన అనిరుద్ ని కాని, లేదంటే దేవిశ్రీ ప్రసాద్ ని గాని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది చిత్ర యూనిట్ నుంచి ఎవరైనా స్పందించే వరకు వేచి చూడాలి. తమన్ కాకున్నా దేవిశ్రీ ప్రసాద్ తో త్రివిక్రమ్ ని సూపర్ హిట్ ఆల్బమ్స్ ఉన్నాయి. ఈ నేపధ్యంలో అతనిని ఫస్ట్ ఛాయస్ గా ఉంచుకున్నట్లుగా టాక్ నడుస్తుంది.