త్రివిక్రమ్ మహేష్.. ఎప్పటికి ఇంతేనా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న మూడవ సినిమా ‘గుంటూరు కారం’ షూటింగ్ కు ఊహించని విధంగా బ్రేకులు పడుతున్నాయి. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే మంచి హైప్ అయితే ఉంటుంది కానీ వీరి కలయిక ఎప్పుడు కూడా స్మూత్ గా కొనసాగింది లేదు. వీరి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘అతడు’ ఫినిష్ చేయడానికి రెండేళ్లు పట్టింది. ఇక ఆ తరువాత వచ్చిన ‘ఖలేజా’ సినిమాకు 3 ఏళ్ళ సమయం పట్టింది.

ఇక గుంటూరు కారం అయినా తొందరగా ఫినిష్ అవుతుంది అనుకుంటే ఇది ఇంకా దారుణంగా ఆలస్యం అవుతోంది. కాంబినేషన్ సెట్ అయినప్పటి నుంచి కథ విషయంలోనే త్రివిక్రమ్ చాలా మార్పులు చేశాడు. ఇక మరోసారి షూటింగ్ స్టార్ట్ చేశాక ఒక షెడ్యూల్ పూర్తయిన తరువాత కూడా కథను క్యాన్సిల్ చేసి మరో కొత్త కథను ఫైనల్ చేశారు.

అయినప్పటికీ మహేష్ బాబు ఏదో ఒక కారణంగా షూటింగ్ కు గ్యాప్ ఇవ్వాల్సి వస్తోంది. ఇక హీరోయిన్ పూజా హెగ్డేను తప్పించి శ్రీలీలను మేయిన్ లీడ్ గా చేశారు. కెమెరామెన్ కూడా తప్పుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని కూడా తప్పించే అవకాశం ఉంది. ఏదేమైనా మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూడవసారి కూడా స్మూత్ గా సాగడం లేదు.

ఇక ఈ సినిమా షూటింగ్ అసలు ఫినిష్ అవుతుందా లేదా అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక గుంటూరు కారం సినిమాను అయితే 2024 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ఇప్పటివరకు 30 శాతం షూటింగ్ కూడా ఫినిష్ కాలేదు. ఇక కేవలం 5 నెలల సమయం మాత్రమే ఉంది. మరి ఈ టైమ్ లో ఏం చేస్తారో చూడాలి.