తెలుగు, తమిళ భాషల్లో నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటి త్రిష వెబ్సిరీస్లో నటించేందుకు ఆసక్తి చూపినట్టు సమాచారం. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రుపొందిస్తున్న ఓ వెబ్సిరీస్లో నటించేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది.
కాగా మొదట తమిళంలో తెరకెక్కనున్న ఈ వెబ్సిరీస్.. ఆ తర్వాత తెలుగులోకి కూడా విడుదల కానుంది. అది అలా ఉంటే.. రానా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ హాథీ మేరీ సాథీ’ లో రానాతో పాటు త్రిష కూడా నటించిందట. అయితే ఈ చిత్రంలో ఆమె గెస్ట్ రోల్ చేసిందని టాక్.
ఈ సినిమాలో కీలక పాత్ర చేసిందట. అంతేకాదు బ్లౌజ్ లేకుండా చీర కట్టుతోనే కనిపిస్తుందట. ముప్పై నిమిషాల పాటు త్రిష పాత్ర నిడివి ఉంటుందట. దానికోసం ఆమెకు ఏకంగా 80 లక్షల పారితోషికం ముట్టచెప్పారని టాక్. రానాతో త్రిష అలాంటి పాత్ర చేసిందా? అని కూడా టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. త్రిష పాత్రని ఇప్పటివరకు గోప్యాంగానే ఉంచారని చెప్పుకుంటున్నారు.