టాలీవుడ్‌లో హీరోయిన్లే లేరా.?

హీరోయిన్ల కొరతతో ఈ మధ్య టాలీవుడ్ సతమతమవుతోంది. గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ఇదే పరిస్థితి. ప్రస్తుత పరిస్థితి చూస్తే శ్రీలీల తప్ప ఇంకెవ్వరూ కనిపించడం లేదు.

పూజా హెగ్ధే బ్యాక్ టు బ్యాక్ రెండు పెద్ద ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది. అవే ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘గుంటూరు కారం’. పూజా హెగ్ధే తప్పుకోవడంతో మరో హీరోయిన్ ఎవరా.? అన్న డైలమాలో వున్న స్థితిలో లటుక్కున అందేసుకుంది ఆ అవకాశాల్ని శ్రీలీల.

రష్మిక, కృతి శెట్టి వంటి వాళ్లున్నప్పటికీ.. రష్మిక బాలీవుడ్‌లో బిజీగా వుంది. కృతి శెట్టిపై నెగిటివ్ ఇంపాక్ట్ వేసేసి లైట్ తీసుకుంటున్నారు. ఆమెకు ఆ సత్తా వున్నప్పటికీ ఎక్కడ రిస్క్ చేయాల్సి వస్తుందో అని ఆలోచించి వెనక్కి తగ్గుతున్నారు.

ఇక, మృణాల్ ఆల్రెడీ రెండు సినిమాల్లో నటిస్తోంది. సంయుక్తా మీనన్‌కి హిట్స్ వచ్చినా ఎందుకో దబ్బిడి దిబ్బిడిగా అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోంది.

ఈ పరిస్థితికి టాలీవుడ్‌లో కొందరు దర్శకులు, నిర్మాతలు, హీరోలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఏం చేయలేని పరిస్థితి. దాంతో, శ్రీలీల ఒక్కతే సింగిల్ ఆప్షన్ అయిపోయింది.