దిల్ రాజు 50వ బ‌ర్త్‌డే.. చిరు, ప‌వ‌న్, మ‌హేష్‌, ప్ర‌భాస్, య‌ష్‌, విజ‌య్‌ల రాక‌తో శోభాయ‌మానంగా మారిన ప్రాంగ‌ణం

తెలుగు ఇండ‌స్ట్రీలో డిస్ట్రిబ్యూట‌ర్‌గా అడుగుపెట్టిన దిల్ రాజు ఇప్పుడు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బ‌డా నిర్మాత‌గా ఎదిగారు. స్టార్ హీరోలంద‌రితో సినిమాలు చేసిన దిల్ రాజు ఎన్నో సూప‌ర్ హిట్స్ అందించారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి వ‌కీల్ సాబ్ చిత్రం చేస్తున్న దిల్ రాజు త్వ‌ర‌లో ఎఫ్ 3 అనే ఫ‌న్ ఎంట‌ర్‌టైనర్‌ను సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం దిల్ రాజు భార్య గుండెపోటుతో క‌న్నుమూయ‌గా, ఆయ‌న చాలా కుంగిపోయారు. అయితే త‌న తండ్రికి తోడు లేకుండా పోయింద‌ని భావించిన కూతురు క‌రోనా స‌మ‌యంలో త‌న తండ్రికి రెండో పెళ్ళి చేసారు

తేజ‌స్విని అనే యువ‌తిని రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు క‌రోనా వ‌ల‌న సాదా సీదాగా వివాహం జ‌రుపుకున్నాడు. ఇండ‌స్ట్రీకి సంబంధించి ప్ర‌ముఖుల‌ని కూడా ఆహ్వానించ‌లేదు. ఈ నేప‌థ్యంలో నేడు త‌న 50వ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నిన్న రాత్రి గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశాడు. టాలీవుడ్‌ నుంచి పలువురు అగ్ర హీరోలు హాజరై దిల్ రాజుకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ , మ‌హేష్ బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రామ్, య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్, నాగ చైత‌న్య‌, స‌మంత‌, పూజా హెగ్డే, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వ‌రుణ్ తేజ్, నితిన్ దంప‌తుల‌తో పాటు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు

డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా తనదైన ముద్ర వేసిన దిల్ రాజు ఈ రోజు 50వ ఏట అడుగుపెట్టారు. లాక్‌డౌన్ సమయంలో నిజామాబాద్‌లోని ఒక ఆలయంలో తేజస్వినితో దిల్ రాజు వివాహం చాలా సింపుల్‌గా జరిగింది. ఈ పెళ్లికి పెద్దగా దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి ఉన్నారు. పెళ్లి స‌మ‌యంలో లాక్‌డౌన్ అమలులో ఉండటంతో దిల్ రాజు రిసెప్షన్‌ను నిర్వహించుకోలేకపోయారు. సినీ ఇండస్ట్రీకి పెళ్లి పార్టీ ఇవ్వలేకపోయారు. అందుకనే, ఇప్పుడు ఆయన సినీ ప్రముఖుల కోసం ఒక పార్టీ ఏర్పాటుచేస్తున్నట్టు వినికిడి. మొత్తానికి దిల్ రాజు పార్టీలో ఇండ‌స్ట్రీకి చెందిన స్టార్స్ అంద‌రు హాజ‌రు కావ‌డంతో ఆ ప్రాంగ‌ణం కోలాహాలంగా మారింది.