చిరంజీవిపై కేసు పెట్టాలని చూసాడు ఆగం అయ్యాడు.. 

తెలుగు సినిమా దగ్గర ఉన్న ఇప్పటి దిగ్గజ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఐతే చిరంజీవి బయట ఎంత సాఫ్ట్ గా ఉంటారో తెలిసిందే. తనని ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా తాను వారిని ఒకవేళ బయట కలవాల్సి వస్తే ఎంతో ఆప్యాయంగానే పలకరిస్తూ ఉంటారు.

మరి తాను అలా ఉంటారు కాబట్టే చాలా మందికి ఈజీగా టార్గెట్ అయిపోతూ ఉంటాడని మెగా ఫ్యాన్స్ అంటూ ఉంటారు. అయితే రీసెంట్ గా తమిళ సినిమా దగ్గర జరిగిన ఓ ఇష్యూ లో చిరంజీవి మాట్లాడ్డం మళ్ళీ తన మీదకే తీసుకొచ్చింది. కాగా స్టార్ హీరోయిన్ త్రిష విషయంలో నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలని చిరు కూడా ఖండిస్తూ కామెంట్స్ చేశారు.

దీనితో మన్సూర్ అలీఖాన్ తిరగేసి చిరంజీవి పై కేసు వేసే ప్రయత్నం చేసి ఏకంగా తనపై 20 కోట్ల పరువు నష్టం దావా వేయాలని చూసాడు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే తమిళనాడు హై కోర్ట్ మన్సూర్ కి బుద్ధి చెప్పింది. అసలు ఇదో కేసు కాదని నీ వాళ్ళ త్రిష నీపై కేసు పెట్టాల్సింది అని తెలిపింది.

అందరినీ కెలికేదీ నువ్వే మళ్ళీ రివర్స్ లో నువ్వే నిరపరాధివీ అన్నట్టుగా రివర్స్ కేసులు వేస్తావు అంటూ కేసు కొట్టేసినట్టుగా తీర్పు ఇచ్చింది. దీనితో ఈ న్యూస్ విన్న మెగా ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవిని ఆగం చేద్దాం అనుకున్నవారు ఎవరూ బాగుపడలేదు అని అలాగే ఇప్పుడు మన్సూర్ కి కూడా జరిగింది అని మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.