మార్చి 29న ‘టిల్లు స్క్వేర్‌’ వస్తున్నాడు!

డీజే టిల్లు సినిమాతో యూత్‌ ని విపరీతంగా ఎంటర్టైన్‌ చేసాడు సిద్ధూ జొన్నలగడ్డ. ఈ సినిమా ఒక డ్రగ్‌ లా ఆడియన్స్‌ ని ఎక్కేసింది. రాధిక అనే పేరుని అబ్బాయిలు తెగ వాడేశారు. డీజే టిల్లు సినిమా డైలాగులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఆ రేంజ్‌ హిట్‌ అయిన ఈ సినిమాకి సీక్వెల్‌ ని రెడీ చేసే పనిలో ఉన్నాడు సిద్ధూ జొన్నలగడ్డ.

మార్చ్‌ 29న టిల్లు స్క్వేర్‌ ఆడియన్స్‌ ముందుకి రానుంది. నేహా స్థానంలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సీక్వెల్‌ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. సిద్ధూ మాత్రం టిల్లు స్క్వేర్‌ పైన చాలా కాన్ఫిడెంట్‌ గా ఉన్నాడు. మరి మార్చి 29న టిల్లు స్క్వేర్‌ ఎలాంటి రిజల్ట్‌ ని సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి. అయితే టిల్లు వచ్చిన వారం రోజులకి ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో విజయ్‌ దేవరకొండ ఆడియన్స్‌ ముందుకి వస్తున్నాడు.

ది ఫ్యామిలీ స్టార్‌ సినిమా కారణంగా టిల్లు స్క్వేర్‌ లాంగ్‌ రన్‌ కి సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సిద్ధూ జొన్నలగడ్డ మరో రెండు సినిమాలకి ప్యారలెల్‌ గా వర్కౌట్‌ చేస్తున్నాడు. ఇందులో తెలుసు కదా ఒకటైతే.. మరొకటి జాక్‌. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ‘‘జాక్‌ .. కొంచెం క్రాక్‌’’ సినిమా తెరకెక్కుతుంది.

ఇటీవలే టైటిల్‌ అనౌన్స్మెంట్‌ జరుపుకోని రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా జరుపుకుంటున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ కొంచెం గ్యాప్‌ తర్వాత మళ్లీ స్టార్ట్‌ అయ్యింది. ఈరోజు నుంచి హైదరాబాద్‌ లో జాక్‌ కొత్త షెడ్యూల్‌ స్టార్ట్‌ అవనుంది. దాదాపు 35 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌ తో జాక్‌ సినిమా 65% కంప్లీట్‌ అవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్‌ లో టాకీతో పాటు యాక్షన్‌ పార్ట్‌ ని కూడా తెరకెక్కించనున్నారు.