హీరోలని మార్చుకుంటున్న ఆ ఇద్దరు దర్శకులు

ఈ ఏడాది ఆరంభంలో వాల్తేర్ వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవికి దర్శకుడు బాబీ బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. ఇక బాలకృష్ణకి గోపీచంద్ మలినేని సూపర్ హిట్ మూవీ అందించాడు. ఒకేసారి రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు ఒకే బ్యానర్ నుంచి రావడం విశేషం కాగా, ఆ రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం మరో సెన్సేషన్ అని చెప్పాలి.

ఇక దర్శకుడు బాబీ జై లవకుశ, వెంకీ మామ, వాల్తేర్ వీరయ్య సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక గోపీచంద్ మలినేని క్రాక్, వీరసింహారెడ్డితో రెండు హిట్స్ ని తన ఖాతాలో వేసుకొని హ్యాట్రిక్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఓ హాట్ టాక్ నడుస్తుంది. గోపీచంద్ మలినేని కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పాడని, ఇక మెగాస్టార్ ఆ కథని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు డైరెక్టర్ బాబీ కూడా బాలయ్య కోసం ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ ని `సిద్ధం చేసాడని తెలుస్తుంది. ఇక ఈ కథని చెప్పడానికి రెడీ అవుతున్నారనే మాట కూడా వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు ఒకే సారి వచ్చి ఇద్దరు స్టార్ హీరోలతో హిట్స్ కొట్టిన ఈ దర్శకులు ఇప్పుడు హీరోలని మార్చుకొని మరోసారి పవర్ ఫుల్ కాంబినేషన్స్ ని సెట్ చేసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.

ఈ సినిమాలు రెండూ సెట్ అయిన మళ్ళీ ఒకేసారి ఇద్దరు పోటీ పడిన ఆశ్చర్యం లేదనే మాట వినిపిస్తుంది. దీనికి కారణం ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ తో సినిమా చేస్తున్నాడు. తరువాత మరో ఇద్దరు దర్శకులు లైన్ లో ఉన్నారు.

అలాగే బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తూ ఉండగా తరువాత పూరి జగన్నాథ్, శ్రీవాస్, పరశురాం ఉన్నారు. వారిలో ఒకరికి కమిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో మరోసారి ఈ ఇద్దరు దర్శకులు ఒకేసారి మెగాస్టార్, బాలయ్యని పోటీలోకి తీసుకొచ్చే ఛాన్స్ లు ఉన్నాయనే మాట గట్టిగ వినిపిస్తుంది.