గుంటూరు కారం టేస్ట్ చేయబోతున్న ఆ పాప!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీ రెండు షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసి మరల దానిని పక్కన పెట్టారు. ఇప్పుడు కంప్లీట్ గా కొత్త వెర్షన్ తో ఫ్రెష్ గా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. లేటెస్ట్ వెర్షన్ మహేష్ బాబుకి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే మొదట అనుకున్న హీరోయిన్ పూజా హెగ్డేని చిత్రం నుంచి తప్పించారు.

ఆమె స్థానంలోకి శ్రీలీల వచ్చి చేరింది. మహేష్ బాబుకి మెయిన్ లీడ్ గా ఇప్పుడు శ్రీలీల ఉండబోతోంది. ఇక సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం చాలా మంది పేర్లు పరిశీలించిన ఫైనల్ గా హిట్ 2 ఫేమ్ మీనాక్షి చౌదరిని ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక కొత్త కథతో మళ్ళీ మొదటి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి త్రివిక్రమ్ సిద్దమయిన నేపథ్యంలో షెడ్యూల్ కూడా ఖరారు చేశారంట.

జులై మొదటి వారం నుంచి గ్యాప్ లేకుండా కంటిన్యూగా షూటింగ్ చేయడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అనుకున్న అప్పటికి రెడీ కాకపోవచ్చని టాక్. సమ్మర్ లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉందంట. గుంటూరు కారం మూవీ నుంచి మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా కట్ చేసిన మాస్ గ్లింప్స్ కూడా ప్రస్తుతం మూవీలో ఉండకపోవచ్చని టాక్.

ఏది ఏమైనా ఏడాది తర్వాత కంప్లీట్ గా కథ, కథనం మార్చేసి మరల న్యూ సబ్జెక్ట్ తో గుంటూరు కారం మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ట్ చేయడం విశేషం. ఈ సినిమా వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి రాజమౌళి మూవీకి రెడీ కావాలని మహేష్ బాబు ప్లాన్ చేసుకుంటున్నారంట. దానికోసం బల్క్ డేట్స్ త్రివిక్రమ్ కి కేటాయించినట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ అక్టోబర్, నవంబర్ నాటికి గుంటూరు కారం కంప్లీట్ చేస్తే ఈ ఏడాది ఆఖరులో రాజమౌళి సినిమా ఎనౌన్స్మేంట్ తో పాటు లాంచింగ్ ఉండే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల మాట. రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ లో స్టార్ట్ కావొచ్చని టాక్. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా అక్కడికి వెళ్తారా లేదంటే ప్రత్యేకంగా సెట్స్ వేసి షూటింగ్ కంప్లీట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.